హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వలింగసంపర్కం : లైవ్ వీడియో చూసి షాకైన భార్య, సంసారానికి పనికిరాడని ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వలింగ సంపర్కానికి అలవాటుపడిన తన భర్త తనను వదిలించుకునేందుకు చిత్రహింసలు పెడుతున్నాడంటూ ఓ భార్య సైదాబాద్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసింది.

పెళ్లైన నాటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

 పెళ్లైన నాటి నుంచి భార్యకు దూరంగానే

పెళ్లైన నాటి నుంచి భార్యకు దూరంగానే

సైదాబాద్‌కు చెందిన యువతికి జహీరాబాద్‌కు చెందిన ఓ స్కూల్ యజమాని అంకుష్‌తో 2014 మే నెలలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి అంకుష్ తన భార్యకు దూరంగానే ఉంటున్నాడు. కారణం లేకున్నా తరుచూ మానసికంగా హింసిస్తూ, కొట్టేవాడు.

భర్తలో ఎప్పటికైనా

భర్తలో ఎప్పటికైనా

తన భర్తలో ఎప్పటికైనా మార్పు వచ్చి తనను బాగా చూసుకుంటాడని నమ్మింది. కానీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. నిత్యం బెడ్రూంలో లోపల నుంచి గడియ పెట్టుకొని ఒంటరిగా ఉంటూ మొబైల్ ఫోన్లో లైవ్ వీడియో ద్వారా దుస్తులు విప్పదీసి యువకులతో గంటలకొద్ది చాటింగ్ చేస్తుండేవాడని తెలుస్తోంది.

 అతని గుట్టు అలా రట్టయింది

అతని గుట్టు అలా రట్టయింది

కూకట్‌పల్లిలోని ఓ అపార్టుమెంటులో తన ప్లాటులోని యువకులను రప్పించుకొని తమ కార్యకలాపాలు సాగించేవాడు. యువకులను మారుస్తూ తరుచూ టూర్లు వేసేవాడు. అతడి ప్రవర్తనపై క్రమంగా అనుమానం వచ్చిన భార్య.. సెల్ ఫోన్ లైవ్ వీడియోలో ఓ యువకుడితో సాగిస్తున్న చర్యలను కనిపెట్టింది. దీంతో అతడి గుట్టు రట్టయింది.

 రికార్డ్ దృశ్యాలు బయటపడటంతో

రికార్డ్ దృశ్యాలు బయటపడటంతో

రికార్డు దృశ్యాలను ఆమె తన అత్త, మామ, మరిదిలకు చూపించింది. వారు పట్టించుకోలేదని తెలుస్తోంది. విషయం తెలిసి అంకుష్ ఆమెపై మరింత రెచ్చిపోయాడు. అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై ఒంటరిగా వదిలేసి కారులో వెళ్లిపోయాడు.

 కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు

కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు

ఆమె అక్కడి నుంచి సైదాబాదులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యుల సహకారంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.వారు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్ననారు. అంకుష్‌ను అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 సంసార జీవితం గడపలేదు

సంసార జీవితం గడపలేదు

పెళ్లైన నాటి నుంచి అంకుష్ తనతో సంసార జీవితం గడపలేదని, అతడిలోని లోపం బయటపడకుండా ఉండేందుకు రోజూ వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. అతడి కుటుంబ సభ్యులు ఈ విషయం దాచి పెళ్లి చేశారని ఆరోపించింది. పెళ్లి సమయంలో రూ.30 లక్షల కట్నం, రూ.50 తులాల బంగారం ఇచ్చినట్లు చెప్పింది.

English summary
Another husband harasses wife in Hyderabad. She complaint against husband in Saidabad police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X