వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఫ్: వాజపేయిపై చింతామోహన్ షాకింగ్ కామెంట్స్

బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి తమకు స్వయంగా గొడ్డు మాంసాన్ని వడ్డించారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి తమకు స్వయంగా గొడ్డు మాంసాన్ని వడ్డించారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆయన తమకు గొడ్డు మాంసాన్ని వడ్డించిన తర్వాత, మరుసటి ఏడాదికి ఆయన ప్రధాని అయ్యారని చెప్పారు. గురువారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Chinta Mohan interesting comments on beef

1997లో ప్రతిపక్ష నేతగా ఉన్న వాజపేయి తనతో పాటు బీఎస్పీ అధినేత కాన్షీరామ్‌ను విందుకు ఆహ్వానించారని, తన ఇంట్లోనే పశుమాంసంతో చేసిన వంటలను వడ్డించారన్నారు.

అంతటి ఉదార స్వభావం ఉన్న నేత కనుకనే అదే రోజు మాయావతిని యూపీ ముఖ్యమంత్రిని చేశారని చెప్పారు. ఆ తర్వాత ఏడాదిలో ఆయన ప్రధానమంత్రి అయ్యారన్నారు.

<strong>బీఫ్ బ్యాన్‌పై అసెంబ్లీలో చర్చ: బీఫ్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసి మరీ వెళ్లారు!</strong>బీఫ్ బ్యాన్‌పై అసెంబ్లీలో చర్చ: బీఫ్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసి మరీ వెళ్లారు!

స్వతంత్ర భారతదేశంలో ఏది తినాలో, ఏది తినకూడదో ఆంక్షలు పెట్టే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. పెద్దమాంసం విక్రయాలపై నిషేధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు.

English summary
Former Union Minister Chinta Mohan interesting comments on beef.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X