వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నా ఒక్కడిదే కాదు: జీఎస్టీపై మాటమార్చిన నరేంద్ర మోడీ
జీఎస్టీ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట మార్చారు. జీఎస్టీ తమ ప్రతిభనే అని ఇంతకాలం బిజెపి నేతలు, నరేంద్ర మోడీ చెప్పారు.
న్యూఢిల్లీ: జీఎస్టీ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట మార్చారు. జీఎస్టీ తమ ప్రతిభనే అని ఇంతకాలం బిజెపి నేతలు, నరేంద్ర మోడీ చెప్పారు.
కానీ ఇప్పుడు మోడీ మాట మార్చారు. జీఎస్టీ అనేది తన ఒక్కడి నిర్ణయం కాదని చెప్పారు. ఒక్క పార్లమెంటే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయమన్నారు.
జీఎస్టీ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానిది చిన్న పాత్ర మాత్రమే అన్నారు. గుజరాత్ గౌరవ్ మహా సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జీఎస్టీ కౌన్సిల్లో దాదాపు 30 పార్టీలు ఉన్నాయని, జీఎస్టీని అమలు చేయాలనే నిర్ణయానికి సంబంధించి ఈ పార్టీలన్నీ భాగస్వాములేనని మోడీ అన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీది కూడా సమానమైన పాత్ర అన్నారు. జీఎస్టీపై అబద్దాలను ప్రచారం చేయడం కాంగ్రెస్ మానుకోవాలన్నారు.
Comments
English summary
Defending the new national sales tax or GST, Prime Minister Narendra Modi today said that "the decision to implement the reform was not of Prime Minister Modi alone." He said there were nearly 30 parties that were consulted and involved with the new tax, of whom he singled out one.
Story first published: Tuesday, October 17, 2017, 12:30 [IST]