వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టోల్ గేట్ సిబ్బంది నిర్వాకం.. రూ.40కి బదులు రూ.4 లక్షలు స్వైప్

టోల్ గేట్ ఫీజు కోసం ఓ డాక్టర్ తన డెబిట్ కార్డును సిబ్బంది చేతికిస్తే.. వారు రూ.40కి బదులు రూ.4 లక్షలకి స్వైప్ చేసేశారు. పాపం.. మొబైల్ కి వచ్చిన మెసేజ్ చూసుకోగానే గుండె ఆగినంత పనైంది ఆయనకి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మంగళూరు: కార్డుల స్వైపింగ్ తో పెద్ద చిక్కొచ్చిపడింది. కార్డు చేతికిస్తే.. అవతలి వాళ్లు ఎంతకి స్వైప్ చేసుకుంటున్నారో కార్డుదారుడికి తెలియడం లేదు. ఒక్కోసారి మొబైల్ ఫోన్ కి మెసేజ్ కూడా రావడం లేదు. దీంతో లోలోపల తెలియని ఆందోళన.

సరిగ్గా ఇలాంటి సంఘటనే కొచ్చి-ముంబై జాతీయ రహదారి దగ్గర్లో ఉడిపి వద్ద చోటు చేసుకుంది. గుండ్మి టోల్ గేట్ వద్ద మైసూరుకు చెందిన ఓ డాక్టర్ డెబిట్ కార్డుపై రూ.40కి బదులు రూ.4 లక్షలు స్వైప్ చేసేశారు.

Karnataka: Doctor shocked after toll gate employee swipes Rs 4 lakh from card instead of Rs 40

మైసూరుకు చెందిన డాక్టర్ రావు, తీరప్రాంతం మీదుగా ముంబైకి వెళుతూ టోల్ గేట్ దగ్గర రూ.40 చెల్లించడానికి అక్కడున్న సిబ్బందికి తన కార్డు ఇచ్చారు. కార్డును స్వైప్ చేసిన వ్యక్తి పీఓసీ రశీదు కూడా ఇచ్చాడు.

ఇంతలోనే డాక్టర్ గారి మొబైల్ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. అందులో రూ.4 లక్షలు ఆయన అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లుగా ఉంది. దీంతో ఆయనకు షాక్ తగిలినంత పనైంది. వెంటనే ఆ విషయాన్ని టోల్ గేట్ వద్ద ఉండే సిబ్బందికి ఆయన తెలిపినా ఫలితం లేకపోయింది.

వారు తప్పు తమది కాదన్నారు. దీంతో డాక్టర్ రావు దగ్గర్లోని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఇక టోల్ గేట్ సిబ్బందికి తమ తప్పిదాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఆ తప్పుడు మొత్తాన్ని తానే పొరపాటున స్వైప్ చేశానని టోల్ గేట్ అటెండెంట్ ఒప్పపకున్నాడు.

డాక్టర్ రావుకు డబ్బు తిరిగి ఇవ్వడమేకాక.. జరిగిన పొరపాటుకు క్షమాపణ చెబుతూ అదనపు మొత్తాన్ని కూడా ఆఫర్ చేశారు. అయితే ఆయన ఆ డబ్బు తీసుకోకుండా, కేవలం తనకు రావలసిన మొత్తాన్ని మాత్రమే తీసుకున్నారు. సదరు టోల్ గేట్ వద్ద రోజుకి రూ.8 లక్షల వరకు వసూలు అవుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

English summary
The assistance of Bengaluru police was sought on Saturday after a toll booth employee mistakenly transferred Rs 4 lakh instead of Rs 40 from a passenger’s account. The incident occurred at the Gundmi toll gate on the Kochi-Mumbai National Highway near Udupi around 10:30 PM when a Mysuru-based doctor handed the employee his debit card. After swiping the card, the employee than gave the doctor the receipt of the transaction. Following the transaction, the doctor received a message of the transaction where it said that Rs 4 lakh had been debited from his account. When the doctor complained to the toll booth about the erroneous transaction, they refused to acknowledge it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X