ఫిర్యాదు:ఎంఏల్ఏ కన్పించడం లేదు, శశికళే నిర్భంధించారు
తమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంఏల్ఏ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఆర్. దురైకన్ను కన్పించడం లేదంటూ ఓ విశ్రాంత ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చెన్నై:తమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఎంఏల్ఏ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఆర్ .దురైకన్ను కన్పించడం లేదని ఓ విశ్రాంత ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశికళ, ఆమె కుటుంబసభ్యుల నుండి తమ ఎంఏల్ఏను కాపాడాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు.
67 ఏళ్ళ బిహెచ్ ఈ ఎల్ విశ్రాంత ఉద్యోగి కె.మహలింగం పాపనాశనం పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహాలింగం అన్నాడిఎంకెలో చురుకైన కార్యకర్త.
శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన సమయం నుండి తమ ఎంఏల్ఏ దురైకన్ను కన్పించడం లేదంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శశికళ, ఆమె కుటుంబసభ్యులు తమ ఎంఏల్ఏ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఆర్. దురైకన్నును నిర్భంధించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. స్పెషల్ ఎస్ ఐ. మురుగేషన్ స్వయంగా ఈ పిటిషన్ ను తీసుకొని రిసిప్ట్ కూడ ఇచ్చారు.
తమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఎంఏల్ఏ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఆర్ .దురైకన్ను కన్పించడం లేదని ఓ విశ్రాంత ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశికళ, ఆమె కుటుంబసభ్యుల నుండి తమ ఎంఏల్ఏను కాపాడాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు.