బెడ్రూం నిండా కెమెరాలే: ఆ లేడీ వలలో 25 మంది ఎంపీలు?
బిజెపి ఎంపిని బ్లాక్ మెయిల్ చేసి పోలీసులకు చిక్కిన మాయలేడీ గుట్టు రట్టయింది. ఆమె వలలో దాదాపు 25 మంది ఎంపీలు పడినట్లు విచారణలో తేలింది.
న్యూఢిల్లీ: రాజస్థాన్ బిజెపి ఎంపీ కెసి పటేల్ హానీ ట్రాప్ వ్యవహారాన్ని లాగితే డొంకంతా కదిలింది. తనను రేప్ చేశాడంటూ ఆరోపణలు చేసిన ఆ కిలాడీ లేడీ సామాన్యురాలు కాదని తేలింది. నిజానికి, ఆమె ఐఎఎస్ చదివి కలెక్టర్ కావాలని కన్నది. ఆ కల నెరవేరలేదు.
రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగమైనా సంపాదించాలని కోరుకుంది. అదీ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు పార్లమెంటు సభ్యులను బోల్తా కొట్టించి తర్వాత వారిని బెదిరిస్తూ వసూళ్లు ప్రారంభించింది. ఇటీవల రాజస్థాన్ ఎంపీ కెసి పటేల్ను మాయ చేసిన ఆ యువతి ఆయనతో అసభ్యకర పొజిషన్లలో ఫొటోలు దిగి రూ.5 కోట్లు డిమాండ్ చేసింది. దీంతో ఆ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈమెను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో దిమ్మదిరిగే విషయాలు బయటపడ్డాయి. ఈమె వెనుక ఓ పెద్ద ముఠా ఉన్నట్లు వెల్లడైంది. ఏకంగా 25 మంది ఎంపీలను ఈమె ఇలా మోసం చేసినట్లు బయటపడింది. ఈ జాబితాలో కేసీ పటేల్ సహా పలువురు ఉన్నారు.
ఈ మహిళ బెడ్ రూంలో నిండా కెమెరాలే ఉన్నట్లు తెలిసింది. ఏ మూలన ఉన్నా వాటిలో స్పష్టంగా రికార్డవుతుంది. ఈమె వద్ద నిత్యం 4 స్పై కెమెరాలుంటాయి. ఈకెమెరాలో డేటాతో ఎంపీలను బెదిరిస్తుంటుంది. ఎంపీకి ఫోన్ చేసి న్యాయ సమస్యలున్నాయని చెబుతుంది.
ఇంటికి వస్తే కలిసి మాట్లాడదామని పిలుస్తుంది. ఎంపీ ఇంటికి వెళ్తే వారిని బెడ్రూంలోకి తీసుకెళ్తుంది. అక్కడ మత్తుమందిచ్చి ఫొటోలు, వీడియోలు తీస్తున్నట్లు బయటపడింది.