100 మందిని రిసార్టులో పెడితే నేనే సిఎం: శశికళకు రానా డైలాగ్ ఝలక్
నటుడు రానా దగ్గుబాటి నటిస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలోని ఓ డైలాగ్ ఇప్పుడు తమిళనాట ఆసక్తిని రేపుతోంది. ఇది చర్చనీయాంశంగా మారింది.
చెన్నై: నటుడు రానా దగ్గుబాటి నటిస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలోని ఓ డైలాగ్ ఇప్పుడు తమిళనాట ఆసక్తిని రేపుతోంది. ఇది చర్చనీయాంశంగా మారింది.
రానా తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో నటించారు. ఈ సినిమా తమిళంలో నాన్ ఆనైయిట్టాల్ అనే పేరుతో విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైయలర్ విడుదల చేశారు. ఇందులో వంద మంది ఎమ్మెల్యేలను ఓ రిసార్టులో కూర్చోబెడితే నేను కూడా ముఖ్యమంత్రినే అనే డైలాగ్ ఉంది.
దీంతో ఇది తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకే ముక్కలు అయిన విషయం తెలిసిందే.
శశికళ వర్గం, పన్నీరుసెల్వం వర్గాలుగా విడిపోయాయి. శశికళ సీఎం కావాలనుకున్నారు. అప్పటికే సీఎం పీఠంపై ఉన్న పన్నీరుసెల్వం రాజీనామా చేసేందుకు ససేమీరా అన్నారు.
అనంతరం ఆమె జైలుకు వెళ్లడం, తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించడం, తన తరఫున పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానా డైలాగ్ ఆసక్తిని రేపుతోంది.