'ప్లీనరీ అంటే తెలియని షర్మిల, విజయమ్మ, రోజా, లక్ష్మీపార్వతి'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు లక్ష్మీపార్వతి, రోజా, షర్మిల, వైయస్ విజయమ్మలకు ప్లీనరీ అంటే అర్థం తెలియదని తెలుగు యువత నాయకులు శివనాగమల్లేశ్వర రావు ఎద్దేవా చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు లక్ష్మీపార్వతి, రోజా, షర్మిల, వైయస్ విజయమ్మలకు ప్లీనరీ అంటే అర్థం తెలియదని తెలుగు యువత నాయకులు శివనాగమల్లేశ్వర రావు ఎద్దేవా చేశారు.
చదవండి: జగన్ నాతో చెప్పారు, మోడీకి తెలిసిపోయింది: బాబుపై ఊగిపోయిన షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆదివారం ఆ పార్టీ మహిళా నేతలు లక్ష్మీపార్వతి, రోజా, షర్మిల, వైయస్ విజయమ్మ చేసిన ప్రసంగాలను నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన తెలిపారు.
వైసిపి అధినేత జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. అనంతరం శివనాగమల్లేశ్వర రావు మాట్లాడారు. దేశంలో రైతులకు ఎక్కడా లేనివిధంగా రూ.24,500 కోట్ల రుణాలు మాఫీ చేసింది తమ ప్రభుత్వమే అన్నారు.
Recommended Video
జలయజ్ఞం పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
11 ఛార్జీషీట్లలో నిందితుడిగా ఉన్న జగన్కు మంత్రి పదవి చేపట్టి దూసుకెళ్తున్న లోకేష్కు ఏ మాత్రం పోలిక లేదన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్చంధంగా 33