వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ దేవాదాయ శాఖలో ఈవో ఉద్యోగాల నియామక పరీక్ష ఫలితాలు విడుదల

|
Google Oneindia TeluguNews

అమరావతి: దేవాదాయ శాఖలో ఈవో ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్ష కోసం అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గురువారం విడుదల చేసింది.

60 ఈవో పోస్టుల భర్తీ కోసం జులై 24న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్ష రాసిన 52,915 మంది అభ్యర్థుల్లో.. 1278 మంది అర్హత సాధించారు. మెయిన్స్ అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలోనే తెలియజేస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది.

AP endowment department EO screening exam result realeased

ఏపీ ఆర్బీకేలో త్వరలోనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ వివరాలను వెల్లడించారు. ఈ శాఖలో మొత్తం 6758 అగ్రికల్చర్ అసిస్టెంట్, 4000 హార్టికల్చర్ అసిస్టెంట్, 400 స్కిల్ బోర్డు(పట్టు పరిశ్రమ) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరయ్యాయి.

అయితే, ఈ పోస్టుల్లో ఇప్పటి వరకు 6321 అగ్రికల్చర్ అసిస్టెంట్, 2356 హార్టికల్చర్ అసిస్టెంట్, 378 సిల్క్ అసిస్టెంట్ పోస్టులను మాత్రమే భర్తీ చేశారు.
ఈ క్రమంలోనే మిగిలిపోయిన పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు.

5521 కాల్ సెంటర్ నెంబర్ ద్వారా రైతు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తన్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రతి నెలా 1.51 లక్షల రైతు భరోసా మాస పత్రికలను ముద్రిస్తూ రైతులకు సాంకేతిక సలహాలు, సమాచారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు.

English summary
AP endowment department EO screening exam result realeased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X