IDBI బ్యాంకులో ఉద్యోగాల జాతర: ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్: అర్హతలు ఇవే..!!
బ్యాంకులో ఉద్యోగం చేయాలని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులన్నీ దేశవ్యాప్తంగా భర్తీ చేయనుంది ఐడీబీఐ బ్యాంకు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఓపెన్ కాంపిటీషన్ ద్వారానే పోస్టులన్నీ భర్తీ చేయడం జరుగుతుందని భర్తీ ప్రక్రియలో ఎవరినీ నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు ఐడీబీఐ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
ఐడీబీఐ బ్యాంకు విడుదల చేసిన 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో జనరల్ కేటగిరీలో 373 పోస్టులు ఉండగా ఎస్సీ కేటగిరీలో 138 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 69 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 248 పోస్టులు ఉన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 92 పోస్టులు ఉంంగా పీడబ్ల్యూడీ కోటాలో 36 పోస్టులను కేటాయించడం జరిగింది.
విద్యార్హతలు:
గుర్తింపు
పొందిన
యూనివర్శిటీ
నుంచి
55శాతం
మార్కుల
ఉత్తీర్ణతతో
ఏదైనా
డిగ్రీ
ఉండాలి.
ఎస్సీ
ఎస్టీ
పీడబ్ల్యూడీ
అభ్యర్థులకు
50శాతం
మార్కులతో
డిగ్రీ
ఉంటే
చాలు.
ఇక
కచ్చితంగా
55శాతం
లేదా
50శాతం
మార్కులు
తప్పనిసరి
అని
ఐడీబీఐ
స్పష్టం
చేసింది.అభ్యర్థులు
ఆన్లైన్
టెస్టు
రాయాల్సి
ఉంటుంది.
అయితే
ఆన్లైన్
టెస్టు
ఎప్పుడు
ఉంటుందనేది
బ్యాంకు
తన
అధికారిక
వెబ్సైట్పై
పొందుపరుస్తుంది.
ఇక
పోస్టుల
సంఖ్య
పెరగొచ్చు
లేదా
తగ్గొచ్చు
అని
స్పష్టం
చేసింది.
అభ్యర్థుల వయస్సు 1 జూలై 2021 నాటికి 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు ఎక్స్ సర్వీస్మెన్లకు 5 ఏళ్ల పాటు ప్రభుత్వ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్
లైన్
రిజిస్ట్రేషన్
4
ఆగష్టు
2021న
ప్రారంభమై
18
ఆగష్టు
2021న
ముగుస్తుంది.
ఆన్లైన్
టెస్టు
05
సెప్టెంబర్
2021
ఉండే
అవకాశం
ఉంది.
ఇక
ఎంపికైన
అభ్యర్థులు
మూడేళ్ల
కాంట్రాక్ట్
పూర్తి
చేసుకున్న
తర్వాత
వారిని
అసిస్టెంట్
మేనేజర్గా
ప్రమోట్
చేస్తారు.ఇక
మూడేళ్ల
పాటు
తొలి
ఏడాది
రూ.29వేలు,
రెండవ
ఏడాది
రూ.31వేలు,
మూడవ
ఏడాది
రూ.34వేలు
వేతనం
పొందుతారు.
కాంట్రాక్ట్
సమయంలో
అభ్యర్థులు
దేశంలోని
ఏ
ఐడీబీఐ
బ్రాంచ్లో
నైనా
పోస్టింగులు
ఇవ్వబడతాయి.
అభ్యర్థులు ఐడీబీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేయాలి. అంతకుముందు అభ్యర్థులు వైట్ పేపర్పై బ్లాక్ పెన్తో సంతకం చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇది 10కేబీ నుంచి 20 కేబీ సైజుతో ఉండాలి. ఇక ఫోటో కూడా స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఫోటో సైజు 20 నుంచి 50 కేబీ మధ్య ఉండాలి. పూర్తి వివరాలకోసం : www.idbibank.in సందర్శించండి