మిధానిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు, అర్హతలు చూడండి..!
మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఆర్టిసియన్, జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 జనవరి 2021
సంస్థ పేరు: మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు: జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఆర్టిసియన్, జూనియర్ స్టాఫ్ నర్స్
పోస్టుల సంఖ్య: 9
జాబ్ లొకేషన్: హైదరాబాదు
దరఖాస్తుకు చివరి తేదీ: 23 జనవరి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత, ఇంజినీరింగ్లో డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్
వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 జనవరి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://midhani-india.in/