సౌత్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్: 520 ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి
భారతీయ రైల్వేలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే విభాగం 520 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 520 గూడ్స్ గార్డ్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 24న ప్రారంభం కాగా.. దరఖాస్తుకు డిసెంబర్ 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేయనున్న మొత్తం 520 ఖాళీల్లో జనరల్ విభాగంలో 277, ఓబీసీ విభాగంలో 87, ఎస్సీ విభాగంలో 126, ఎస్టీ విభాగంలో 30 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎగ్జామ్ మొత్తం 100 మార్కులకు నిర్వహించనున్న ఈ పరీక్షలో జనరల్ అవేర్ నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ కు సంబంధించిన ప్రశ్నలను అడగనున్నారు. ప్రతీ తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్ చేస్తారు.
దరఖాస్తు విధానం
మొదటగా https://www.rrcser.co.in/notice.html/https://www.rrcser.co.in/ అధికారిక వెబ్ సైట్ సంప్రదించాలి.
Online Link For GDCE 2021 For Goods Guardపై క్లిక్ చేసి, ఆ తర్వాత వచ్చే పేజీలో అప్లై నౌ(apply now) అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేముందు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాలని సం
నోటిఫికేషన్
కోసం
ఇక్కడ
క్లిక్
చేయండి
https://ser.indianrailways.gov.in/cris//uploads/files/1637056247942-GDCE%202021.pdf