సింగరేణిలో 155 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ: అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేయండి
తెలంగాణలో ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా, తాజాగా, సింగరేణి కేలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) కూడా పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళితే..
మొత్తం భర్తీ చేయనున్న క్లర్క్ పోస్టులు: 155
వీటిలో 95 శాతం ఖాళీలను సింగరేణి పనులు జరుగుతున్న నాలుగు జిల్లాల్లోని ఇన్ సర్వీస్ ఉద్యోగులకు, మిగిలిన 5 శాతం పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులో కొనసాగుతోన్న అభ్యర్థుల ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అండర్ గ్రౌండ్ వర్కర్లలో ఏడాదికి 190 మస్టర్లు పూర్తి చేసినవారు, సర్ఫేస్ వర్కర్స్లో 240 మస్టర్లు పూర్తి చేసినవారు అర్హులు. వీటితోపాటు ఆరు నెలల సర్టిఫికేషన్ కోర్సు, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి లేదా కంప్యూటర్ డిప్లొమా కోర్టు చేసి ఉండాలి.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫాంను ఆఫ్లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.
అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ పరీక్షలు 85 మార్కులకు వెయిటేజీ ఉంటుంది. 15 మార్కులకు అసెస్మెంట్ నివేదిక ఉంటుంది. రెండింటి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు జూన్ 10, 2022 చివరి తేదీకాగా, దరఖాస్తులను ఆఫ్లైన్ లో పంపించడానికి జూన్ 25, 2022 చివరి తేదీ.
నోటిఫికేషన్, పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.