Teacher jobs:గిరిజన సంక్షేమ శాఖలో భారీ రిక్రూట్మెంట్..3479 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్లో భాగంగా 3479 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పోస్టు పేరు: ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్
పోస్టుల సంఖ్య: 3479
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఉంటుంది
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 ఏప్రిల్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://tribal.nic.in/