సైంటిస్టులకు కనిపించిన దేవుడు!: అంతుపట్టని రహస్యాలివే
డా.యం.ఎన్.చార్య-
శ్రీమన్నారాయణ
ఉపాసకులు
,ప్రముఖ
అంతర్జాతీయ
జ్యోతిష
పండితులు
-9440611151
జ్ఞాననిధి
,
జ్యోతిష
అభిజ్ఞ
,
జ్యోతిష
మూహూర్త
సార్వభౌమ"ఉగాది
స్వర్ణ
కంకణ
సన్మాన
పురస్కార
గ్రహీత"
ఎం.ఏ
జ్యోతిషం
-
పి.హెచ్.డి
"గోల్డ్
మెడల్"
,ఎం.ఏ
తెలుగు
(ఏల్)
,
ఎం.
ఏ
సంస్కృతం
,
ఎం.ఏ
యోగా
,
యోగాలో
అసిస్టెంట్
ప్రోఫెసర్
శిక్షణ
,ఎం.మెక్
ఎపిపి,
పి.జి.డిప్లమా
ఇన్
మెడికల్
ఆస్ట్రాలజి
(జ్యోతిర్
వైద్యం)
,
పి.జి.డిప్లమా
ఇన్
జ్యోతిషం,
వాస్తు
,
మరియు
రత్న
శాస్త్ర
నిపుణులు.
సునంద
రాజన్
జ్యోతిష
,జాతక,వాస్తు
కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
హైదరాబాద్: సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు ! దేవాలయాల మిస్టరీ
ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటి వరకూ వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది.
ఆలోచనాతరంగాలను రేకెత్తించే పుణ్యక్షేత్రాలు విశేషాలు వాటి మిస్టరీలు కొన్ని అవేమిటో తెలుసుకుందాం.
అక్కడ ఇళ్లకే కాదు బ్యాంకులకూ తాళాలు వేయరు!
శని శింగనాపూర్ మహారాష్ట్రలో ఇది ఒక గ్రామం.ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. అంత పవర్ ఆ శని సింగనాపూర్ శనిదేవుడిది .
పెరుగుతూ పోతున్న నంది విగ్రహం
యాగంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాగంటి ఆలయం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటి వరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగావున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు శ్రీ మద్వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు కాలజ్ఞానంలో చెప్పినట్ట్లు కలియుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూవుంటారు.
అంతు చిక్కని లేపాక్షి స్థంభాల మర్మం
లేపాక్షీ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలి పోయాయి. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు. అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో ఇంత వరకు ఎవ్వరూ చెప్పలేక పోయారు.
మిస్టరీగానే తంజావూరు..
తంజావూరులో మిస్టరీ తంజావూరు లోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది.అలాగే ఆ ఆలయానికుపయోగించిన గ్రానైట్ ను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు.
పూరీ మహాత్మ్యం
ఇలాగే
మరొకటి
కూడా
పూరీజగన్నాథ్
ఆలయం
పూరీజగన్నాథ్
ఆలయంలో
నీడ
ఎలాంటి
సమయంలో
కూడా
కనిపించదు.
అంతేకాదు
పూరీక్షేత్రానికి
సమీపంలో
బంగాళాఖాతం
సముద్రం
వుంది.
ఆ
సముద్రపు
శబ్దంకూడా
ఈ
ఆలయంలోకి
వినిపించదు.
ఆలయ
సింహ
ద్వారం
వరకూ
సముద్రఘోష
వినిపిస్తుంది.
అది
దాటి
లోపలికి
వెళ్తే
శబ్దం
అనేదే
వుండదు.
మరి
ఆ
టెక్నాలజీ
ఏంటో
కూడా
అంతుచిక్కలేదు.
పాముల ఆలయం.. ఇక్కడ అన్నీ కరవని పాములే
మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్ ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది వుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూ వుంటాయి. కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు.
ఈ తేళ్లు కుట్టవు
అమ్రోహా ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్ళు! అవును ఇక్కడ ఆలయంలోపల చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు రెండుకాదు వేలసంఖ్యలో అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు.వారు వాటిని పట్టుకుంటారు కూడా ఇలా మన భరతభూమిలో ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి.