దేహమే దేవాలయం: ఎందుకిలా చెప్పాల్సి వచ్చిందంటే.?
మనం అందరం చిన్నప్పటి నుండి మన పెద్ద వాళ్ళు చెప్పారని దేవాలయాలకు పోతున్నాము. అక్కడ గర్బగుడిలో వున్న ఈశ్వర లింగాన్ని లేక అక్కడ వున్నా దేవత ప్రతిమని చూసి మనసార మొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని ఇంటికి వచ్చి ఈరోజు గుడికి వెళ్లి నేను దేవుడిని దర్శనం చేసుకున్నాను అనుకోని మనం సంతృప్తి పడతాము. కానీ ఇక్కడ ఒక వేదాంత విషయాన్నీ గ్రహించాలి.అది ఏమిటంటే దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం అందులో (గర్భ గుడిలో) అంటే అంతరంలో ఈశ్వరుడు . అతని దర్శనం.
దేవాలయం ఒక దేహం
నిజానికి పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటే మానవశరీరం. ఇక్కడ "తత్" (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము.
దేవాలయ ప్రాచీనత
భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడనీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టదనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబిచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.
దేహమే దేవాలయం..
"దేహమే
దేవాలయం"
అవును
నీ
దేహమే,
పంచభూతాలతో
నిర్మితమైన
నీ
శరీరమే
దేవాలయం.
ఈ
శరీరానికి,
మనస్సుకు,
బుద్దికి,
ప్రాణానికి,
జీవానికి
(అజ్ఞానంతో
ఏర్పరచుకున్న
కర్మ
బంధనాలు)
అన్నిటికి
శక్తిని
ఇచ్చే
ఆ
పరమాత్మనే
ఈశ్వరుడు.
ఆ
ఈశ్వరుడు
నీ
శరీరపు
అంతరంలో
హృదయంలోనే
స్వయం
ప్రకాశితమై
దేదీప్యమానంగా
వున్న
ఆ
చిదానంద
స్వరూపుడు
అయిన
ఆ
దేవదేవుడు
నిరాకారుడు,
శాశ్వతుడు,
సత్యుడు,
నిర్గుణుడు,
సమస్త
లోకాలకు
సృష్టి
కర్తయైన
ఆ
సర్వేశ్వరుడు
ఈ
శరీరపు
అంతరంలోనే
వుండి
తను
ఏమి
చేయక
తన
శక్తి
చేత
ఈ
శరీరాన్ని
ముందుకు
నడుపుతున్నాడు.
నీ
శరీరపు
అంతరంలో
వున్న
ఆ
పరమేశ్వరుడు
స్వయం
ప్రకాశితమై
వెలుగుచున్నాడు
అక్కడ
ఏ
సూర్యుడు
లేడు.
చంద్రుడు
లేడు.
ఆయనే
స్వయం
ప్రకాశి.
సూర్య
చంద్రులు
కూడా
అయన
యొక్క
శక్తి
చేతనే
ప్రకాశింపబడుతున్నారు.
అదియే దేవాలయం
మీ హృదయాంతరాలంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దేవదేవునిని మీద మనస్సు ఉంచి సాధన (అంటే ధ్యానం) ద్వార మీ హృదయాంతరంలోనే దర్శించుకొని మీరు పొందిన ఈ మానవ జన్మకు సార్ధకతను ఇవ్వండి. అదియే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదియే దేవాలయం యొక్క విశిష్టత. దేవాలయానికి వెళ్లి గుడిలో వున్న లింగాన్ని దర్శించడం అంటే మనం మన హ్రుదయాన్తరంలో వున్న ఆ సర్వేస్వరున్ని ధ్యానం ద్వార పరిపూర్ణ (సంపూర్ణ) దర్శనం చేసుకోవాలి అని ఆ విధంగా మనం దానిలోని వేదాంతాన్ని గ్రహించడానికి మన పెద్దలు అలోచించి అలా చేయవలసి వచ్చింది.
ఓం నమో పరమాత్మయే నమ:
Dr.M.N.Charya
Taraka
.HYD
9440611151