చంటిపిల్లల్ని కాళ్ళమీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తారు.. ఎందుకు ?
ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్దె మహిళలకు ఓ ముఖ్యమైన పండగ. ఈ పండగరోజు అట్లపోస్తారు.
చిన్నారులకి స్నానం చేయించటమన్నది చాలా పెద్దపని. అందుకనే పసిపిల్లలకు అత్తగారో, అమ్మవంటి పెద్దవారో ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేయిస్తు ఉంటారు. చిన్నారులుస్నానం చేసే సమయంలో నీళ్ళు చెవుల్లోకి, ముక్కుల్లోకి వెళితే చంటి పిల్లవాడికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది . అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు కాళ్ళమీద పడుకోబెట్టు కొని, గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తారు.
స్నానానికి అరగంట ముందు పిల్లవాని ఒంటికి నూనె రాసి, మొత్తగా మసాజ్ చేసి మాడుకు ఆముదం పెట్టి, ఆ తరువాత నలుగు పిండితో స్నానం చేయించాలి. ఆవిధంగా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తే పిల్లలు ఏడ్వరు. నలుగుపెట్టి, నూనె రాసి స్నానం చేయించటం ద్వారా చిన్నారులకు వ్యాయామం అవుతుంది. తద్వారా మంచి ఆరోగ్యకరమైన శరీర పటుత్వం వస్తుంది. భవిష్యత్తులో అందంగా, ఆరోగ్యంగా పెరుగుతారు.)
జపం ఏయే ప్రదేశాల్లో చేయాలి?
ఇంట్లోలో జపం ఎంత చేస్తే అంత ఫలితము ఉంటుంది. నదీ పరిసర ప్రాంతాల్లో జపంచేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో జపంచేస్తే వందరెట్లు, యాగశాలలో జపంచేస్తే అంతకు మించి ఫలితం దేవతా సన్నిధిలోనూ జపంచేస్తే 10వేల రెట్లు ఫలితం వస్తుంది. శివాలయంలోగాని, శివసాన్నిధ్యంలో గాని జపంచేస్తే మహోన్నతమైన ఫలితం వస్తుంది.
పులితోలు మీద కూర్చుని జపంచేస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు చాపపై కూర్చుని జపము చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాయిమీద కూర్చుని జపంచేస్తే రోగాలు వస్తాయి. కటిక నేల మీదకూర్చుని జపంచేస్తే దుఃఖము సంభవిస్తుంది. కొయ్యపీట మీద కూర్చుని జపంచేస్తే దారిద్ర్యం కలుగుతుంది. గడ్డిమీద జపంచేస్తే కీర్తి నాశనము అవుతుంది.
అట్లతద్దినాడు అట్ల ఎందుకు పోస్తారు ?
ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్దె మహిళలకు ఓ ముఖ్యమైన పండగ. ఈ పండగరోజు అట్లపోస్తారు. అలా పోసేటప్పడు అట్లకు ఎన్ని రంద్రాలు పడతాయో, అన్నివేల సంవత్సరాలు తమకి అయిదో తనాన్ని ప్రసాదించమని గౌరిదేవిని ప్రార్ధించటమే అట్లతద్దె ఆనవాయితి. అలాగే పెళ్ళికాని వారు ఈ అట్లతద్దె జరుపుకోవటంవల్ల తమకు వచ్చే వరుడు అందగాడు, చక్కటిసంతానం కలుగుతారని ఓ ప్రగాఢ విశ్వాసం.
మసాలా దినుసులు ఆరగించడం శాస్త్రప్రకారము మంచివా కాదా ?
మిరియాలు రకాన్ని గడ్డ కట్టించవు. ఆకలిని పెంచుతాయి. లవంగం రక్తం గట్టిపడకుండా నిరోధిస్తుంది. అల్లం రక్తంలో ప్రమాదంగా మారే చెడు పదార్థాలను సరిచేస్తుంది. ఇక నీరుల్లిని ఎంత పచ్చిగాతిన్నా ఉడికించి తిన్నారకాన్ని నిరంతరం మన శరీరంలోకి ప్రవహింప చేస్తుంది.