కార్తీక ద్వాదశి ప్రత్యేకత: చేయాల్సిన దానాలు
హైదరాబాద్: ద్వాదశీ దానములు ఏకాదశినాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశినాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధినీ ద్వాదశి అనే పేరు వచ్చింది. అటు వంటి ఈరోజు హరిబోధినినాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానమును చేస్తారో, వాళ్లు ఇహములో భోగాను సేవనాన్నీ, పరములో భోగిశయనామ సేవనాన్నీ పొందుతారు.
కార్తీక ద్వాదశినాడు పెరుగు-అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ వుంది. ఎవరైతే ఈ ద్వాదశినాడు పాలిచ్చే ఆవును, వెండి డెక్కలూ, బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్లు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే వుంటాయో, అన్నివేల సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు.
ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశినాడు సాలగ్రామాన్నీ, బంగారపు తులసీ వృక్షాన్నీ - దక్షిణా సమేతముగా దానము చేస్తారో వాళ్లు.. చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్నీ దానము చేసినంత పుణ్యాన్ని పొందుతారు. ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెబుతాను విను.
శ్లో
.
యో
జీవతి
ఋణీనిత్యం
నియమం
కల్పమశ్నుతే
|
పశ్చాత్తస్యసుతో
భూత్వా
తత్సర్వం
ప్రతిదాస్యతి
|
ఎవడయితే ఋణం తీర్చకుండానే పోతాడో, వాడు మరుసటి జన్మలో ఋణదాతకు సంతురూపముగా జన్మించి ఆ ఋణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందు చేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ ఋణము చెల్లుబెడతాను.