కార్తీక మాసం: ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో పర్వదినాలు
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి
,
జ్యోతిష
అభిజ్ఞ
,
జ్యోతిష
మూహూర్త
సార్వభౌమ"ఉగాది
స్వర్ణ
కంకణ
సన్మాన
పురస్కార
గ్రహీత"
ఎం.ఏ
జ్యోతిషం
-
పి.హెచ్.డి
"గోల్డ్
మెడల్"
,ఎం.ఏ
తెలుగు
(ఏల్)
,
ఎం.
ఏ
సంస్కృతం
,
ఎం.ఏ
యోగా
,
యోగాలో
అసిస్టెంట్
ప్రోఫెసర్
శిక్షణ
,ఎం.మెక్
ఎపిపి,
పి.జి.డిప్లమా
ఇన్
మెడికల్
ఆస్ట్రాలజి
(జ్యోతిర్
వైద్యం)
,
పి.జి.డిప్లమా
ఇన్
జ్యోతిషం,
వాస్తు
,
మరియు
రత్న
శాస్త్ర
నిపుణులు.
సునంద
రాజన్
జ్యోతిష
,జాతక,వాస్తు
కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
కార్తీక మాసం అంటేనే ప్రకృతి అహ్లాద పరిచే వాతవరణం ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్న ప్రత్యేక పర్వదినాలు, కార్తీక స్నానాలు,వనభోజనాలు, దైవ దర్శనాలు,పూజలు, దీక్షలు,వ్రతాలు,దాన ధర్మాలు మొదలగునవి ఎన్నో ఉంటాయి.మనిషిని సన్మార్గం వైపు నడిపించేది,ఆరోగ్య కరమైన పండగల ప్రత్యేక ఆహారాన్ని అందించేది ఈ కార్తీకమాసం శివకేశవులకు ప్రితికరమైన మాసం ఇది.
శుక్లపక్ష విదియ భాతృ ద్వితీయ
దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.
శుక్లపక్ష చవితి " నాగుల చవితి
కార్తీక శుక్లపక్ష చవితినాడు నాగుల చవితి పర్వదినం జరుపుకుంటారు.
శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి
ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీ మహా విష్ణువు ఈ రోజు నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి 'ఉత్థాన ఏకాదశీ లేదా 'ప్రబోధన ఏకాదశి ' అని పేర్లు. ఈ రోజు ఉపవాస వ్రతం పాటించి శ్రీ మహా విష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.
శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి
పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీ మహా లక్ష్మిని శ్రీ మహా విష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే . ఈ రోజు ఇంట్లో ఉన్న తులసికోట వద్ద శ్రీ మహా విష్ణువును లక్ష్మీ సమానురాలైన తులసిని పూజించవలెను.
శుక్లపక్ష చతుర్దశి : వైకుంఠ చతుర్ధశి
వైకుంఠవాసుడైన శ్రీ మహా విష్ణువు ఈ రోజు వైకుంఠంను వదిలి వారణాసి వెళ్ళి పరమ శివుడిని పూజించినట్లు కథనం. ఈ నాడు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించవలెను .
శుక్లపక్ష పూర్ణిమ :
ఈ రోజు శివాలయాల్లో నిర్వహించే జ్వాలాతోరణంను దర్శించడం మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలోగానీ, వైష్ణ్వాలయంలో గానీ దీపాలను వెలిగించవలెను. ఈ రోజు ఇంట్లో మరియు గుడిలో 365 వత్తులు దేవుని సమక్షంలో వెలిగించాలి.
కృష్ణపక్ష చవితి : సంకటహర చతుర్ధి
ఇది వినాయకుడుకి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం మంచిది.
వృశ్చిక సంక్రమణం16-11-2018 శుక్రవారం :-
ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడు ఈ రోజు తులారాశి నుండి ఎనిమిదవ రాశి అయిన వృశ్చికరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు , దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వవిధాలా శుభఫలితాలను ఇస్తుంది.
కార్తీకమాసంలో విధులను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక పరమైన ఫలాలను పొందడమే కాకుండా మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల కొత్తగా తలెత్తుతూ ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చును.