మార్గ శిర మాసం ప్రాధాన్యత ఏంటి..శుభకార్యాలకు మంచి రోజులు ఏవో తెలుసుకోండి..!!
డా.యం.ఎన్.చార్య
-
ప్రముఖ
అంతర్జాతీయ
జ్యోతిష,
జాతక,
వాస్తు
శాస్త్ర
పండితులు
-
శ్రీమన్నారాయణ
ఉపాసకులు.
సునంద
రాజన్
జ్యోతిష,
జాతక,
వాస్తు
కేంద్రం.
తార్నాక
-హైదరాబాద్
-
ఫోన్:
9440611151
శాంతకారం
భుజగశయనం
పద్మనాభం
సురేశం
విశ్వాకారం
గగన
సదృశం
మేఘవర్ణం
శుభాంగమ్
లక్ష్మీకాన్తం
కమలనయనం
యోగిహృ
ద్ధ్యానగమ్యం
వందే
విష్ణుం
భవభయహరం
సర్యలోకైక
నాథం
మార్గశిర మాసం ఆరంభం. హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికంగా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రంలో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసంలో చేసే ఏ పూజైన, దానమైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయంగా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు.
చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలం గా లేక పొతే మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రునికి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశికి చెందినది కావున చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్ది చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి.
శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువుని పూజిస్తారు. ప్రాతః కాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహా విష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది. సూర్యుడు 12 రాశుల్లో ఒకదాని నుండి మరోదాని లోనికి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చికరాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు రావడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, చింతపండు పెరుగు మొదలైనవి క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి మనం తీసుకొనే ఆహార పదార్దాలలో వీటిని విరివిగా ఉపయోగిస్తారు.
మార్గశిర
శుద్ద
పంచమి
రోజున
నాగపూజ
చేయడం
విశేష
ఫలితాన్నిస్తుంది.
శుభకార్యాలు
ప్రారంభించడానికి
అనుకూలమైన
రోజుగా
చెప్పబడింది.
మార్గశిర
శుద్ద
షష్ఠిని
స్కంద
షష్ఠి
అని
వ్యవహరిస్తారు.
ఈ
రోజు
సుబ్రహ్మణ్య
స్వామిని
శక్తికొలది
పూజిస్తే
సంతాన
అనుకూలత
కలుగుతుందని
ప్రతీతి.
మార్గశిర
శుద్ద
సప్తమిని
భాను
సప్తమి,
జయ
సప్తమి,
మిత్ర
సప్తమి
అని
అంటారు.
ఈ
రోజు
సూర్యారాధన
చేసి
పాయసం
నివేదన
చేస్తే
అనేకమైన
మంచి
ఫలితాలు
కలుగుతాయి.
మార్గశిర అష్టమిని కాళభైరవాష్టమిగా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు ( కాలం ) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈ రోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది.
మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా చెప్తారు. ఈ రోజు శ్రీ మహా విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వారా దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు.
మార్గశిర శుద్ద త్రయోదశి నాడు హనుమత్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు. మార్గశిర శుద్ద పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామిని నోరార పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.
కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాదులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం యమధర్మ రాజుని ఆరాదిస్తారు. ఈ పౌర్ణమిని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.