లింగంలో నీరు ఉన్న ఆలయం
శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థం. త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు.. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపంలోను సింధూ నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. ఆ కారణంగానే దేశంలో శివాలయాలే ఎక్కువగా ఉన్నాయి. వేదాలలో శివున్ని రుద్రునిగా, శైవంలో పరమాత్మగా, ఆదిదేవునిగా భావిస్తారు. స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని అనేక రూపాలలో ఒకటిగా పూజిస్తారు.
శివుడు
ఆద్యంతాలు
లేవు.
ఆయన
రూపాతీతుడు..
అందుకే
శివును
ఈ
విధంగా
స్తోత్రం
చేస్తారు.
వందే
శంభుముమాపతిం
సురగురుం
వందే
జగత్కారణమ్
వందే
పన్నగ
భూషణం
శశిధరం
వందే
పశూనాం
పతిమ్
వందే
సూర్య
శశాంక
వహ్ని
నయనం
వందే
ముకుంద
ప్రియమ్
వందే
భక్త
జనాశ్రయం
చ
వరదం
వందే
శివం
శంకరమ్
ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటనివాడు శివుడు. కేవలం శివనామస్మరణంతోనే సకల జనులని పరిరక్షించే అమ్మ గుణం కలిగిన వాడు. అనంత పరిశుద్ధుడైనందునే ఏ గుణములు ఆయనను కళంకితుడిని చేయలేదు.
శివుని లీలలు ప్రతిబింబించే దేవాలయాలు దేశంలో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లిలో మీనాక్షి అగస్తీశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే.. ఇక్కడ కొలువైన శివలింగంలో నీరు నిల్వ ఉంటుంది. అలాగని నీరు తీయకుండా వదిలేస్తే పొంగిపొర్లవు. పూజారి నీళ్లు సేకరించి భక్తులపై చల్లినప్పుడు అదే పరిమాణంలో మళ్లీ నీళ్లు ఊరుతాయి. కృష్ణా పుష్కరాలకు వేదికైన ఈ విశిష్ట ఆలయానికి ప్రక్కనే కృష్ణా - మూసి సంగమ ప్రదేశం ఉండటం విశేషం.
ఈ క్షేత్రానికి స్థల పురాణం పరిశీలిస్తే.. కృతయుగంలో అగస్త్యముని ఒక కావడిలో శివుడు, నరసింహస్వామిని పెట్టుకొని పవిత్ర ప్రదేశంలో వారిని ప్రతిష్ఠించాలని నిర్ణయించారట. ఈ క్రమంలో వాడపల్లికి వచ్చేసరికి చేరుకునే సరికి అనుకోని పరిస్థితుల్లో ఆ కావడి కింద పెట్టాల్సి వచ్చిందట. మళ్లీ దాన్ని ఎత్తే ప్రయత్నం చేసి విఫలమైన ఆగస్త్యుడు ఆకాశవాణి వాక్కు మేరకు శివుడు, నరసింహ స్వామిని అక్కడే ప్రతిష్టించాడట. తదనంతరకాలంలో బోయవాడు పక్షిని వేటాడుతూ అక్కడికి వచ్చాడట. ఆ పక్షిని వదిలిపెట్టమని పరమశివుడు కోరాడట. అందుకు ఆ బోయవాడు తనకు ఆకలిగా ఉందనడంతో పక్షి అంత మాంసం నా తలలోంచి తీసుకోమని శివుడు చెప్పాడంతో బోయవాడు తన పదివేళ్లను శివుడి తలలో పెట్టి మాంసం తీసుకున్నాడట. అలా శివలింగం శిరస్సుపై గుంటలా ఏర్పడి అందులో నీళ్లు ఊరుతాయని పురాణ ప్రతీతి.