మృగశిర కార్తె అంటే ఏంటీ ?
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151
మృగశిరకార్తె తేదీ 8 జూన్ 2019 శనివారం నుండి ప్రారంభమవుతుంది.అసలు ఈ కార్తెలు ఎలా ఏర్పడతాయి చూద్దాం. సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ప్రవేశిస్తాడో ఆ నక్షత్రం ఆధారంగా నక్షత్రం యొక్క పేరుతో కార్తె పేరును పిలువబడుతుంది. అశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న ఇరువది ఏడు నక్షత్రాలలో సూర్యభగవానుడు ప్రవేశం ఆధారంగా కార్తెను నిర్ణయించడం జరుగుతుంది. భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కో కార్తెలో దానికి సంబంధించి ప్రకృతిలోని మార్పు, దానివలన జరిగే ప్రత్యేకాంశలను సవివరంగా వివరించింది.
ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే రైతులు పొలాలు దున్ని పంటలు వేయడం మొదలుపెడతారు.మృగశిర కార్తె మొదటి రోజును దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు.ఈ రోజు ప్రత్యేకించి ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి.వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు తింటే వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం.
ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు, జానపదులు ( గ్రామీన ప్రాంతం వారు) ఎక్కువగా వీటిపై ఆధారపడి చేయువృత్తులు, వ్యవసాయం సాగు ఈ కాలగణనతో కార్తెల అధారంగా వారి పంటల నిర్ణయం, సాగు చేసుకుంటారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుండి మృగశిరకార్తె ఏర్పడుతుంది. ఈ కార్తె నుండి వర్షాలు పడతాయని మనవారి భావన. ఇదే సమయంలో మన ప్రాంతంలోకి నైఋతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి.
పంచాగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది.
ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి. ఇతడు చనిపోతూ పురాణగాధ ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను, పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం, వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర హలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు.
ప్రకృతి మార్పు ప్రభావం ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు, వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది.
వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా, వర్షదేవుడుగా పిలుస్తారు. ఇది కథ. ప్రస్తుతం ఈ కార్తె ప్రవేశానికి ముందు తీవ్రమైన ఎండలతో భూమి అంతా వేడేక్కి మానవ శరీరాలు తాపంతో ఉంటాయి. జూన్ మొదటి వారంలో అంటే సుమారుగా 8 తేదీ నుండి ప్రకృతి పరంగా వర్షాలు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వాతావరణంలో తీవ్రమైన ఎండల నుండి వర్షాల వలన వాతావరణం చల్లబడడంతో మానవుల శరీరంలో కూడా ప్రకృతి మార్పు ప్రభావం పడుతుంది. శరీరం ప్రకృతి యొక్క మార్పును తట్టుకోవడానికి ఈ రోజు ఇంగువబెల్లం తింటారు.మాంసాహారం తీసుకునే వారు చేపలను తింటారు.శాఖాహరులు మాత్రం ఇంగువను బెల్లంలో కలిపి గుండ్రని గోళిలాగ చేసి దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకుని కుటుంబ సభ్యులందరు అన్ని వయస్సులవారు తప్పక తింటారు.
ఈ ఆయుర్వేద ప్రక్రియ వలన శరీరం బలంగా ఉంచుతూ, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుంది. మన పెద్దలు అన్ని రకాల ప్రయోగ అనుభవంతో మన పెద్దలు, పూర్వీకులు ప్రతీ విషయాన్ని వారి జీవిత అనుభంలో అన్ని రకాల ప్రయోగ అనుభవసార ఫలితంగా పరిశీలించి వారి తర్వత తరం వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే భావనచే మనకు తరుణోపాయాలు,చిట్కాలు సూచనలు చేసారు. వాటిని ఆచరించించిన వారు ఆరోగ్య ఆనందంతో గడుపుతారు.పెద్దలమాట సద్ధన్నం మూట అని ఊరికే అనలేదు.
ఈ సంవత్సరం పంచాగ ప్రకారం ఈ కార్తె ఫలితాలు:- అల్పవృష్టి ప్రభావం కనబడుతుంది.తొలకరి ప్రారంభ వర్షములు కురుయును మరియు కొన్ని ప్రాంతములలో తుఫానుతో కూడిన వర్ష సుచానులు గోచరిస్తున్నాయి.
ఇంకుడుగుంత సూచనలు:- ఈ కాలంలో పడే వర్షపు నీటిని వృధా పోనివ్వకుండా సద్వినియోగ పరుచుకునే మార్గాలను అన్వేశించాలి. ఇంకుడు గుంతల నిర్మాణం వలన మనకు భవిష్యత్తులో అవి భూమిలో నీటి నిల్వలను పెంచి చెరువులు, భావులు, బోర్లు ఎండి పోకుండా ఉపయోగపడతాయి.
అలాగే భూవసతి ఉన్న వాల్లు ఎక్కువ మోతాదులో చెట్లను నాటాలి. తనకు స్థలంలేని వాళ్ళు మనం నివసించే పరిసర ప్రాంతాలలో, మన ఊరి రోడ్డునకు ఇరువైపుల శక్తి వంచన లేకుండా చెట్లను నాటితే అవి మనకు మేలు చేస్తాయి. భవిష్యత్తులో అవే కాపాడుతాయి.
మంచి పని చేయడానికి కుల, మత, ప్రాంత, లింగ, వయోభేదం లేకుండా సంకల్పించాలి. నాకెందుకులే అనే భావన మాత్రం పొరబాటున కూడా మనస్సుకు రానివ్వవద్దు. మీరు నేడు చేసిన ప్రకృతి సేవయే రేపటి కాలం ( తరం )లో మిమ్మల్ని,భావితరలవారిని కాపాడుతుంది జైశ్రీమన్నారాయణ.