అహం అంతం కావాలంటే.. పెద్దల పాదాలకు నమస్కారం చేయాలా?
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
భారతీయ సాంప్రదాయ ప్రకారం మన పెద్దల పాదాలకు నమస్కారం చేయడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. మన దేశంలో సంస్కారం, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది.పెద్దలను గౌరవించడం అనేది పురాతాన కాలం నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న మంచి సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా మతాలతో సంబంధం లేకుండా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మన తల్లి దండ్రులకు ఇంట్లోని పెద్దలకు లేదా బంధువుల కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం అనేది సంప్రదాయంగా కొనసాగుతోంది.
కానీ ప్రస్తుత కాలంలో పెద్దలు ఎవరు కనిపించినా హాయ్, హలో అని పలకరించుకోవడం. ఈ మధ్యన మరీ విచిత్రమేమిటంటే చాలా మంది స్మార్ట్ ఫోన్లలోనే ఆశీర్వదాలు పొందుతున్నారు. ఇందుకు సోషల్ మీడియాను, పలు రకాల యాప్స్ ను విపరీతంగా వాడుతున్నారు. ఈ రోజుల్లో పాదాలకు నమస్కారం చేసేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. కానీ పెద్దల పాదాలను తాకితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలీదు. అవేంటో ఈ తెలుసుకుందాం.
*** పాదాలను తాకితే మనలో ఉన్న అహం అంతం అవుతుంది . మన దేశంలో వేద కాలం నుండి నేటి యుగం వరకు పెద్దల పాదాలను తాకడం అనే ఆచారాన్ని పాటిస్తున్నాం. ఇది పెద్దలకు ఇచ్చే గౌరవం మరియు ఆశీర్వాదం కోరుకునే విధంగా పరిగణించబడుతుంది. దీనినే చరణస్పర్శ అని కూడా పిలుస్తారు. చిన్న వయసు నుండి పిల్లలు తమ పెద్దల పాదాలను తాకడం నేర్చుకుంటారు. ఇది చేయడానికి ఓ కారణం ఉంది. అదేంటనగా పెద్దల పాదాలను తాకడం ద్వారా మన అహం తొలగి పోతుందని భారతీయులు అమితంగా విశ్వసిస్తారు.
*** ఏదైనా పని చేసే ముందు కొత్తగా ఉద్యోగానికి వెళ్లే ముందు లేదా ఏదైనా కొత్తగా పని ప్రారంభించే ముందు లేదా పనికి బయలుదేరే ముందు లేదా ఇంటికి వచ్చిన తరువాత లేదా చాలా కాలం తరువాత ఒకరిని కలిసిన తరువాత మన ప్రాచీన సాంప్రదాయంలో పెద్దల పాదాలను తాకడం మీరు చూస్తూ ఉంటారు. వ్యక్తి తన కంటే పెద్దల అనుభవ జ్ఞానం, వయస్సునకు గౌరవం ఇస్తారు . ప్రతిగా పెద్దలు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తారు.
*** సానుకూల మరియు ప్రతికూల ప్రవాహం. మానవ శరీరంలో ప్రతికూల మరియు సానుకూల ప్రవాహం ఉందని చెబుతారు. శరీరం యొక్క ఎడమ వైపు ప్రతికూల విద్యుత్తును కలిగి ఉండగా శరీరం యొక్క కుడి వైపు సానుకూల శక్తిని కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క పాదాలను తాకినప్పుడు రెండు శరీరాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి. ఇది సానుకూల మరియు ప్రతికూల శక్తి యొక్క పూర్తి సర్క్యూట్ను సృష్టిస్తుంది.
*** కరుణ, భావోద్వేగాలు ఒక వ్యక్తి పెద్దల పాదాలను తాకినప్పుడు అతను లేదా ఆమె పాదాలను తాకినప్పుడు అతని అహం మరియు ప్రతికూల వైబ్రేషన్లను పక్కన ఉంచుతుంది. మరోవైపు కరుణ (ఆప్యాయత) నిండిన భావోద్వేగాలతో పెద్దలు మీ తలను తాకి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇది పెద్దల నుండి సానుకూల ప్రకంపనలను విడుదల చేస్తుంది అవి మీకు పంపబడతాయి.
*** మానవ జీవ సంబంధమైన ప్రాముఖ్యత పెద్దల పాదాలను తాకడం వెనుక జీవ సంబంధమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని అంటారు. నరాలు మానవుడి శరీరమంతా వ్యాపించాయి. వాటిలో కొన్ని పాదాలు అంటే కాలి మరియు మన చేతుల చేతివేళ్ల వద్ద ముగుస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క వేలి ముద్రలు పెద్దల కాలిని తాకినప్పుడు వేలు శక్తి యొక్క గ్రాహకంగా మారుతుంది తద్వారా పెద్దల శరీరం నుండి వెలువడే శక్తిని అంగీకరిస్తుంది, పెద్దల కాలి వేళ్ళు శక్తినిచ్చేవిగా మారుతాయి.
*** పాదాలను ఎలా తాకాలి ? పాదాలను తాకడానికి సరైన మార్గం మీరు గౌరవనీయమైన లేదా పెద్ద వ్యక్తి యొక్క పాదాలను తాకడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు మీ మోకాళ్ళను వంచకుండా మీ శరీరాన్ని వ్యక్తి వైపు వంచాలి. వ్యక్తి యొక్క పాదాలను తాకడానికి మీ చేతిని ముందుకు సాగించాలి. చేతులు నిటారుగా మరియు శరీరానికి సమాంతరంగా ఉండేలా చూసుకోండి. మీరు మీ కుడి చేతితో వ్యక్తి యొక్క ఎడమ బొటనవేలు మరియు మీ ఎడమ చేతితో వ్యక్తి యొక్క కుడి బొటనవేలును తాకాలి. దీని తరువాత పెద్ద వ్యక్తి తన కుడి చేతిని మీ తలను కప్పి ఆశీర్వాదాలను ఇస్తారు . ఒక పెద్ద లేదా గౌరవనీయ వ్యక్తి యొక్క పాదాలను తాకడం వల్ల వారు మీకు బలం, ఆరోగ్యం, మంచి జీవితం, జ్ఞానం, విజయం లభిస్తుంది.
*** మీరు ఎవరి పాదాలను తాకాలి? భారతీయులు తమ తలిదండ్రులు,గురువులు, భర్త , ఉపాధ్యాయులు, తాతలు,అమ్మమ, నానమ్మ , మామయ్య, అత్త, అన్నలు,వదినలు,పిన్ని బాబాయిలు , సోదరీమణులు, మన జీవితాభివృద్ధికి తోడునిలిచిన మార్గదర్శిని . మీకు జ్ఞానం అందించిన వారిని, గౌరవప్రదమైన మరియు ఆపత్కాలంలో ఆదుకున్న పెద్దవారి పాదాలను తాకి నమస్కారం చేసుకోవాలి.
***
పెద్దల
ఆశిస్సులు
పొందిన
వారికి
అందరి
పెద్దల
శుభ
ఆశీర్వాదముల
పొందడం
వలన
వారికి
గోచార
గ్రహస్థితి
అనుకూలం
లేక
ఇబ్బందులు
పడుతున్న
వారికి
ఇది
మంచి
రెమిడిగా
ఉపయోగ
పడుతుంది.వారిలోని
పాజిటివ్
ఎనర్జీ
మనలో
ఉన్న
నెగిటివ్
ఎనర్జీని
నివారిస్తుంది
.ఉత్తర
భారత
దేశంలో
పెద్దలు
కనబడగానే
అది
ఎలాంటి
ప్రదేశం
అయిన
సరే
తల
వంచి
వారి
పాదాలు
తాకి
నమస్కారం
చేసుకుంటారు.దక్షిణ
భారత
దేశంలో
కుడా
విజ్ఞత
,సాంప్రదాయ
సంస్కారం
కలిగిన
కుటుంబాలలో
పెద్దలను
గౌరవించి
నమస్కరించు
కుంటారు.
*** ఒక్క విషయం గుర్తుకు పెట్టుకోవాలి.మనం దేవాలయంలో ఒక్క భగవంతునికి తప్ప మానవ మాత్రులు ఎంత పేద వారైన అక్కడ కనిపిస్తే వారికి నిలబడి రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి.గుడి ఆవరణంలో మాతరం పాదాలకు తాకి నమస్కారం చేయకూడదు.ఈ సాంప్రాదాయాన్ని మనం మన పిల్లల ముందు మన పెద్దలను గౌరవించి వారి పాదాలకు నమస్కారం చేసి మన పిల్లలతో చేయిస్తే భవిష్యత్తు తరాలవారికి పెద్దలను గౌరవించాలి అనే గొప్ప సంస్కారం భావితరాల వారికి నేర్పించిన వాళ్ళం అవుతాం.పెద్దల ముందు తలవంచితే మేలే జరుగుతుంది కాని కీడు రాదు అని గ్రహించాలి. మనం ఆచరిస్తేనే మన పిల్లలు మనలని చూసి వాళ్ళు చూసి నేర్చుకుంటారు.