తనకుతానుగా ఆగిపోయే రథం.. ఎక్కడో తెలుసా..!!
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151
శ్రీమన్నారాయణుడి మహిమలు మానవ మాత్రులకు అంతుపట్టవు జగన్నాటక సూత్రదారైన శ్రీహరి ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం వెలసాడు.ఈ ఆలయం దేశంలోనే పేరెన్నికగన్నది. ఇక్కడ ఏటా జరిగే రథయాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అపురూప దృశ్యాన్ని కవర్ చేసేందుకు దేశ , విదేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తుంటారు .
అయితే ఇంతటి ప్రతిష్ట, ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు , ప్రత్యేకతలూ ఉన్నాయి. దేశంలోని మరే ఇతర ఆలయంలో లేనన్ని అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతు పట్టకపోవడం విశేషం, అవేంటో చూద్దాం.
మొదటిది - తనంతతానే ఆగిపోయే రథం .. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో ఊరేగింపు గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది . ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు .
రెండోది - నీడ కనిపించని గోపురం - జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదు . సూర్యుడు వచ్చినా నీడ పడదు.ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు.ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు .
మూడోది - గాలికి వ్యతిరేకదిశలో ఎగిరే జెండా - ఎక్కడైనా జండా గాలికి అనుకూలంగా ఎగురుతుంటుంది . కానీ .. పూరీ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది .
నాలుగోది - మనవైపే చూసే చక్రం - పూరీ జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది . ఈ చక్రం ఎటువైపు వెళ్లి చూసినా అది మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది .
ఐదోది - ఆలయంపై ఎగరని పక్షులు - ఇది మరో వింత .. ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు . ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం అంతు పట్టడం లేదు .
ఆరోది - ఆలయంలో వినిపించని అలల సవ్వడి - ఇదో విచిత్రం .. సముద్ర తీరాన కొలువుతీరిన ఈ ఆలయం సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్ర హోరు ఆలయంలో వినిపించదు. మళ్లీ ఆలయం నుంచి అడుగు బయపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది .
ఏడోది - ఘుమఘుమల ప్రసాదం - పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు . అయితే .. ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదు. దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాలకు ఘుమఘుమలాడుతాయి .