Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మనోజ్ మోజు పడ్డాడనే సన్నిలియోన్ కి అంత ఖర్చు
హైదరాబాద్ : సన్నీలియోన్ సెగ తెలుగు చిత్రసీమకు తగలబోతున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ తెలుగు చిత్రంలో తళుక్కున మెరవబోతోంది. మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కరెంటు తీగ'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తారు. లగడపాటి శ్రీధర్ నిర్మాత. ఈ చిత్రంలో సన్నీలియోన్ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వబోతోంది. ఈ విషయాన్ని హీరో మంచు మనోజ్ ఖరారు చేసారు. అయితే ఆమెకు రెమ్యునేషన్ ఎంత ఇవ్వబోతున్నారనే చర్చ అంతటా మొదలైంది.
ఇప్పటికే దర్శక,నిర్మాతలు సన్నీని సంప్రదించి, కాల్షీట్లు సంపాదించారట. ఈ చిత్రం కోసం సన్నీకి ఆకర్షణీయమైన పారితోషికం కూడా ఇచ్చినట్టు సమాచారం. ఆ ఆకర్షయనీయమైన పారితోషికం..పాతిక లక్షలు అని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. తెలుగులో సన్నీ ఒప్పుకొన్న మొదటి చిత్రమిదే కావటంతో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారంటున్నారు. హీరోయిన్ కి కూడా అంత ఇవ్వటం లేదని అంటున్నారు. అంత రెమ్యునేషన్ అనే సరికి మొదట వెనకంజ వేసారని, అయితే మనోజ్ పట్టుపట్టి మరీ ఒప్పించాడని చెప్పుకుంటున్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ... సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర వుంది. దీనికోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని చాలా మందిని వెతికాం. అయితే అందులో నెంబర్వన్ ఎవరున్నారా అని వెతికితే సన్నీలియోన్ కనిపించింది. ఈ సినిమా కోసం ఆమెనే తీసుకోవడానికి ఆమెకున్న క్రేజ్ కారణం. అంతే కాకుండా ఇందులోని పాత్ర ఆమె లాంటి నటి చేస్తేనే బాగుంటుందని భావించి సన్నీలియోన్ను తీసుకోవడం జరిగింది అన్నారు.
''మనోజ్ ఎనర్జీని మరో స్థాయిలో చూపించే చిత్రమిది. అన్ని వాణిజ్య హంగులూ ఉంటాయి'' అని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే 'కరెంటు తీగ'కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.