వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్ర హైకోర్టులో అజర్ సవాల్
న్యూఢిల్లీ: క్రికెట్ నుంచి తనను శాశ్వతంగా బహిష్కరిస్తూ బిసిసిఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేయాలని భారత మాజీ కాప్టెన్ అజహర్ నిర్ణయించారు. ఈ విషయం అజహర్ తరఫు న్యాయవాది భరద్వాజ్చెప్పారు.
అజహర్పై నిషేధానికి ప్రాతిపదికగా వున్న సిబిఐ నివేదిక సక్రమంగా లేదని ఆయన అన్నారు. సిబిఐ దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా జరగలేదని ఆయన చెప్పారు.
అజహర్ బిసిసిఐ నిర్ణయంపై న్యాయస్థానంలో సవాలు చేయాలని నిర్ణయించినట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఢిల్లీ కోర్టుల్లోనే కేసు దాఖలు చేస్తారని భావించారు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు దాఖలు చేయాలని ఆయన నిర్ణయించడం గమనార్హం.
Comments
Story first published: Thursday, January 11, 2001, 23:53 [IST]