వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రో రంగానికిప్రైవేటు సెగలు
న్యూఢిల్లీః పెట్రోలియం రంగాన్నిప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2002 నాటికల్లాపెట్రోలియం పై వున్న సబ్సిడీల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఈ రంగాన్నిప్రైవేటు పరం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రియశ్వంత్ సిన్హా గురువారం వెల్లడించారు. గురువారంకొత్తఢిల్లీలో పెట్రోటెక్ - 2001 సెమినార్ లో ఆయనప్రసంగించారు.
వచ్చేబడ్జెట్ లో పెట్రోలియం రంగాన్ని ప్రైవేటు పరంచేసేందుకు నాంది పలకనున్నట్లు ఆయనవెల్లడించారు. చమురు రంగంలో ప్రభుత్వ సంస్థలవాటాలను 26 శాతానికి కుదించాలని కూడా కేంద్ర ప్రభుత్వంయోచిస్తున్నదని యశ్వంత సిన్హా వివరించారు.చమురు రంగంలో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలనుదీర్ఘకాలంలో ప్రభుత్వాలు భరించలేవనిఆయన చెప్పారు.
Comments
Story first published: Thursday, January 11, 2001, 23:53 [IST]