వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబాయి క్రికెటర్లకుమినహాయింపు
న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల వచ్చిన ముంబాయి క్రికెటర్ల విషయంలో ప్రభుత్వం, క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎలాంటి చర్య తీసుకోకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని భారత మాజీ కాప్టెన్ అజహర్ ఆరోపించారు.
ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ తీవ్రమైన ఆరోపణలు చేసిన అజహర్ తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని కోర్టులో సవాలు చేయనున్నట్టుగా వెల్లడించారు. సునిల్ గవాస్కర్, అనిల్ కుంబ్లేల లాకర్లలో కోట్లాది రూపాయలు దొరికినా వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
రవిశాస్త్రి దగ్గర కూడా లెక్కచూపని నిధులు లభించినప్పటికీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యతీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. తనపై మాత్రం కక్ష కట్టినట్టుగా క్రికెట్ బోర్డ్ వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. తాను మళ్లీ క్రికెట్ ఆడుతానని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, January 12, 2001, 23:53 [IST]