విద్యుత్ ఛార్జీలపై బాబు తర్జనభర్జన
హైదరాబాద్ఃవిద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర క్యాబినెట్ తర్జనభర్జనలు పడుతున్నది.ట్రాన్స్ కో నష్టాలు తడిసి మోపెడు కావడంతోఎంతో కొంత వడ్డనలు చేయకుండా అది గట్టెక్కే పరిస్థితి లేకుండాపోయింది. మళ్ళీ విద్యుత్ ఛార్జీల భారం మోపితేత్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లోతెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనేభయం పార్టీని పట్టిపీడిస్తున్నది.
మధ్యతరగతి ప్రజలకు కొంతవెసులుబాటు కల్పించేందుకు ప్రస్తుతం వున్ననాలుగును ఆరుశ్లాబులకుపెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇక ఆదాయాన్నిపెంచుకొనే మార్గాలు ఏమైన వున్నాయా అనే విషయాన్ని శుక్రవారం
సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారు. విద్యుత్ ఛార్జీలతో పాటు ఈనెల రెండు నుంచి వారం రోజుల పాటు జరిగిన జన్మభూమికార్యక్రమం, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగానిర్వహించిన భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు గురించి కూడా ఈసమావేశంలో చర్చిస్తున్నారు.