వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వ్యవస్థీకృత నేరాలను, ఫాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవస్థీకృత నేరాలు, ఫాక్షనిజం రాష్ట్రంలో శాంతిభద్రతలకు కలిగిస్తున్న విఘాతం దృష్ట్యా ఇప్పుడున్న చట్టాలకు మరింత పదునుపెట్టే ఉద్దేశ్యంతో రూపొందించిన ముసాయిదా బిల్లును శుక్రవారం నాడు జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించారు.

దీనిని కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ముసాయిదా బిల్లు చట్ట రూపం దాలిస్తే, నిందితులకు మరణశిక్ష వంటి కఠిన దండన విధించే అవకాశం ఏర్పడుతుంది. వ్యవస్థీకృత నేరాల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు, అవసరమైన సందర్భాల్లో టెలీఫోన్‌, ఇతర కమ్యూనికేషన్ల టాపింగ్‌కు పోలీసులకు అధికారం కల్పించడం వంటి నిబంధనలు ఈ బిల్లులో వున్నాయి.

మాఫియా కార్యకలాపాలు అధికంగా వున్న ముంబాయిలో మాఫియా ముఠాలను అణిచివేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న చట్టం తరహాలోనే కొత్త బిల్లుకు చంద్రబాబు ప్రభుత్వం రూపకల్పన చేసింది. రాష్ట్ర హోం మంత్రి దేవేందర్‌ గౌడ్‌ స్వయంగా మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాన్ని పరిశీలించి వచ్చిన తర్వాత ఈ బిల్లును తయారు చేశారు.

రాష్ట్రంలోకి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో వున్న కారణంగా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వుండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఆయన పారిశ్రామిక వేత్తలకు, వారి పెట్టుబడులకు పూర్తి భద్రత కల్పిస్తామని హామి ఇచ్చిన విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X