వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్‌లోముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లాఏజెన్సీ ఏరియాలో శుక్రవారం ఉదయం జరిగినఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్‌, ఒకనక్సలైట్‌ మరణించారు. పోలవరం,బుట్టాయగూడెం మండలాల సరిహద్దులోరామనర్సాపురం సమీపంలోని రిజర్స్‌ పారెస్టులో ఈ సంఘటనజరిగింది. సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీఏజెన్సీ సబ్‌ డివిజన్‌ కమిటీ గత మూడు రోజులుగాసమావేశమవుతోందని తెలుసుకున్న గ్రేహౌండ్స్‌పోలీసులు, ఖమ్మం జిల్లా స్పెషల్‌ పోటీసులు వారినిచుట్టుముట్టారు. వీరిని గమనించిన దళసభ్యులు కాల్పులు జరపగా పోలీసులుఎదురు కాల్పులు జరిపారు

ఇందులోదళ సెంట్రల్‌ కమిటీ కమాండర్‌ గంగసానిధర్మన్న (80) అలియాస్‌ మూర్తితో పాటు ఖమ్మం జిల్లాస్పెషల్‌ పోలీసు పార్టీకి చెందిన జవాన్లు చప్పిడిశ్రీనివాసరావు, వేటపాటి శ్రీనివాసరావు మరణించారు.కాల్పుల్లో కానిస్టేబుల్‌ చప్పిడి శ్రీనివాసరావు, ధర్మన్న అక్కడికక్కడేమరణించారు. మరో కానిస్టేబుల్‌ వేటపాటి శ్రీనివాసరావు తీవ్రంగాగాయపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికితరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈఎన్‌కౌంటర్‌లో మరికొంత మంది నక్సల్స్‌ గాయపడివుంటారని భావిస్తున్నారు. సమావేశానికి హాజరైన 30మంది గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X