వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీః చైనాఅగ్రనేత లీపెంగ్‌ శుక్రవారం కొత్తఢిల్లీలోఅధికార కార్యకలాపాలు ప్రారంభించారు. తొమ్మిది రోజుల భారత పర్యటన కోసం లీపెంగ్‌ గురువారంకొత్తఢిల్లీ చేరుకున్నారు. చైనా అధ్యక్షుడుజియాంగ్‌ జెమిన్‌ తరువాత లీపెంగ్‌ చైనాలోఅత్యధిక అధికారాలను నిర్వహిస్తున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

భారత విదేశాంగ మంత్రిజస్వంత్‌ సింగ్‌ శుక్రవారం లీపెంగ్‌ ను ఆయన బసహోటల్‌ లో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య భారత్‌ -చైనా సంబంధాలపై సుదీర్ఘ మంతనాలుజరిగాయి. కాశ్మీర్‌ సమస్యపై భారత్‌ చూపిన చొరవనుజస్వంత్‌ సింగ్‌ లీపెంగ్‌ కు వివరించారు. ప్రపంచవాణిజ్య సంస్ధ ఒప్పందాలు, సరిహద్దు విషయాలు కూడాలీపెంగ్‌, జస్వంత్‌ చర్చల సందర్భంగా చోటుచేసుకున్నాయి.

భారత్‌ - చైనాదేశాల మధ్య మరింత పటిష్ఠమైన సంబంధాలునెలకొనాల్సిన అవసరాన్ని లీపెంగ్‌ నొక్కిచెప్పారని ఆ తరువాతవిలేకరులతో మాట్లాడిన జస్వంత్‌ సింగ్‌ అన్నారు. గురువారం లీపెంగ్‌ను లోక్‌ సభ స్పీకర్‌ బాలయోగి తదితర ప్రముఖులుకలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X