వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భోగి మంటలతో ఎరుపెక్కిన పల్లెలు

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్‌ఃదక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్ర దేశంలో ఆబాలగోపాలం అత్యంత ఉత్సాహంగాజరుపుకొనే సంక్రాంతి పర్వం ప్రారంభమైంది. సంక్రాంతి పండుగకు నాంది పలికే భోగిపండుగను శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నారు. శనివారంవేకువ జామున భోగి మంటల కాంతులతో పల్లెలన్నీ ఎరుపెక్కాయి. భోగి మంటల్లో పాతవస్తువులను అగ్నికి ఆహుతి చేసి,కొత్తదనాన్ని స్వాగతించడం ఈ భోగి సారాశంగాచెబుతారు.

హైదరాబాద్‌లో కైట్‌ ఫెస్టివల్‌
సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ పర్యాటకశాఖ, సాఫ్టవేర్‌ కంపెనీలు సంయుక్తంగా శనివారంఉదయం నక్లెస్‌ రోడ్డులో పెద్ద ఎత్తున కైట్‌ఫెస్టివల్‌ నిర్వహించాయి. వివిధ ప్రాంతాలకుచెందిన వందలాది మంది ఈ గాలిపటాలపండుగలో పాల్గొన్నారు. వివిధ ఆకారాలలో, వివిధవర్ణాలలో రూపొందించి గాలి పటాలతో భాగ్యనగరంవినువీధులు వింత శోభను సంతరించుకున్నాయి.

చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన సంక్రాంతిపండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారిజీవితాల్లో ఈ సంక్రాంతి కొత్త కాంతులను నింపాలని ఆయనఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా దక్షిణాది రాష్ట్రల ప్రజలకు రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌, ప్రధాని వాజ్‌ పేయి శుభాకాంక్షలు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X