80 వేల కోట్లతోజాతీయ విద్యుత్ గ్రిడ్
ముంబాయి:కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 80 వేలరూపాయల భారీ వ్యయంతో జాతీయ విద్యుత్గ్రిడ్ను నిర్మించే ఆలోచనలో వున్నది. ఈ విషయంకేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సురేష్ ప్రభుచెప్పారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ఇండియాతో కలసి సంయుక్తంగా నిర్మించనున్నఈ జాతీయ గ్రిడ్ నిర్మాణం కోసం అవసరమైతేజాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోప్రభుత్వం బాండ్లను జారీ చేస్తుందనికూడా ఆయన చెప్పారు.
ముంబాయిలోపవర్గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినసభలో ప్రసంగిస్తూ, పవర్గ్రిడ్తో జాయింట్వెంచర్ ఏర్పాటుకు రెండు మూడు విదేశీసంస్థలు ముందుకు వచ్చాయని వెల్లడించారు.ఆ కంపెనీల ప్రతిపాదనలను తాముపరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. నేషనల్గ్రిడ్ ఏర్పాటు చేయడం వల్ల వివిధప్రాంతాల్లో అక్కడ అందుబాటులో వున్న వనరులనుబట్టి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేయడానికి, ఇతర ప్రాంతాలకు విద్యుత్సరఫరాకు వీలుగా పకడ్బందీగా పథకాలు చేయడానికిఅవకాశం వుంటుందని సురేష్ ప్రభుచెప్పారు.