భూకంపం మృతులు 594మంది
ఎల్ సాల్విడార్:ఆదివారం ఎల్ సాల్విడార్లో సంభవించిన పెను భూకంపంలోమరణించినవారి సంఖ్య 594కు చేరుకుంది.గాయపడిన వారి సంఖ్య మరో 1830 ఉంది. మృతుల సంఖ్యపెరగవచ్చునని, ఆస్తి నష్టం గురించి ఇంకా అంచనాకురాలేదని అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ చెప్పారు. మొత్తం 32వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొలంబియాప్రభుత్వాన్ని 3 వేల శవపేటికలు ఇవ్వాలని కోరినట్లుఆయన తెలిపారు. దీన్ని బట్టి మృతుల సంఖ్యచాలా ఎక్కువగా వుంటుందని భావించడానికి వీలవుతోంది. మొత్తం 1,336మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లునేషనల్ ఎమర్జెన్సీ కమిటీ చెప్పింది. ఇంకా 1200మంది జాడ తెలియడం లేదు.
వందలాదిమంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైవున్నారు. గ్రామీణ ప్రాంతాలు విద్యుత్ సౌకర్యం లేకఅంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. సాన్సాల్విడార్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. స్పెయిన్, తదితర దేశాలు ఎల్ సాల్విడార్కుసహాయక బృందాలను పంపాయి.
ఇదిలా వుంటే, ఎల్సాల్విడార్ను మరోసారి భూకంపం కుదిపేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారంఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది.ఇది రెక్టార్ స్కేల్పై 4.3 డిగ్రీలుగా నమోదయింది. ఈ భూకంపంవల్ల సంభవించిన నష్టం గురించి వివరాలుతెలియలేదు.
భారీ భూకంపం, 100కు పైగా మృతి