వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సంస్కరణలుకొనసాగిస్తాం: వెంకయ్య
హైదరాబాద్: తమకేంద్ర ప్రభుత్వం సంస్కరణల ప్రక్రియకు కట్టుబడివున్నదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. ఆయన సోమవారంనాడిక్కడ ఒకసదస్సులో ప్రసంగించారు. సంస్కరణల వల్ల పేదరికనిర్మూలన జరగకపోతే, పేదలకు ఉపయోగపడకపోతేఅర్థం లేదనే వ్యాఖ్యలు వినబడుతున్నాయని, సంస్కరణలుపేదలకు ఉపయోగ పడి, పేదరికాన్ని నిర్మూలించేదిశలో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందనిఆయన అన్నారు.
రైతులను, గ్రామీణులను త్రిశంకుస్వర్గంలో వదిలేయకుండా వారికి తగిన సహాయంఅందించాలని మంత్రి ఆర్థిక సంస్థలను కోరారు. పేదలను, గ్రామీణులనుఆదుకోవడానికి ముందు రావాలని ఆయన వాటికిసూచించారు. పట్టణాలకు, గ్రామలకు మధ్య అంతరంరూపుమాపేందుకు కృషి జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Monday, January 15, 2001, 23:53 [IST]