వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎ.పి.పేపర్‌ లో పేలుడు-ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రిః రాజమండ్రిలోని ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్‌పేపర్‌ మిల్లులో సోమవారం ఘోరప్రమాదం సంభవించింది.పేపర్‌ గుజ్జు ప్లాంటులో పేలుడు సంభవించడంతో ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనలో మరో కార్మికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయస్థితిలో వున్న ఈ నలుగురినీ రాజమండ్రి ఆస్పత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ లో చికిత్స చేస్తున్నారు.

గుజ్జు ప్లాంట్‌ లో ప్రమాద వశాత్తు పేలుడు సంభవించడంతో మరుగుతున్న గుజ్జు రసాయనాలు అక్కడ వున్న కార్మికులపై పడ్డాయి. దీనితో ఒక కార్మికుడు తీవ్రంగా కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు సోమవారం రాత్రి ఆస్పత్రిలో మరణించారు. కొద్ది దూరంలో వున్న కార్మికులు తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారు. ఈ సంఘటనతోఎ.పి. పేపర్‌ మిల్లు లోని కార్మికులు తీవ్ర భయాదోళనలకు గురయ్యారు.

160డీగ్రీల ఉష్ణోగ్రతతో మరుగుతున్న గుజ్జుపై మూత బోల్డులను ఉదయం షిఫ్టుకు వచ్చిన కార్మికులు అజాగ్రత్తతో లూజు చేయడంతో ఈ దుర్ఘటన సంభవించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X