వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ఃదుబాయ్ లో ప్రవాస భారతీయులు నడుపుతున్న ఒకమోడల్ స్కూల్ ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబు మంగళవారం సందర్శించారు. చంద్రబాబు ప్రవాస భారతీయవిద్యార్థుల మధ్య విద్యార్థిగా మారిపోయి 45 నిముషాల పాటు సరదాగాగడిపారు. వారితో కలిసి రైమ్స్ ఆలపించారు. బాబుసందర్శించిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఒంగోలుకుచెందిన మాధవరావు అనే వ్యక్తి కావడంవిశేషం.
మోడల్ స్కూల్విద్యార్థులను వారి పాఠ్యాశాలు, క్రీడలు, ఇతర కార్యకలాపాలనుచంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఆ పాఠశాలలోకివెళ్ళే సరికి ప్రవాస భారతీయ విద్యార్థులు గాంధీ,లింకన్ చిత్రాలను ప్రదర్శిస్తూ కనిపించారు. ఆ చిత్రాల్లోనివారెవరని చంద్రబాబు ఆ విద్యార్థులనుప్రశ్నించారు. స్కూలులో వున్నంత సేపు చంద్రబాబుఎంతో ఉల్లాసంగా కనిపించారు.
Story first published: Tuesday, January 16, 2001, 23:53 [IST]