వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి అంత ప్రేమా బాబూ!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః మంత్రులు, ఎమ్మెల్ల్యేల అవినీతి చరిత్రలపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి సారధ్యంలోవిచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీ సోమవారం డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో అవినీతి మర్రిఊడల్లావిస్తరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధికె. రోశయ్య్‌ సోమవారం హైదరాబాద్‌ లో జరిగినవిలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.

ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్ల్యేలపైనే కాకుండా అన్ని పార్టీలకు చెందిన అవినీతి ఎమ్మెల్ల్యేలపై కూడావిచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిసినా వారిలో మార్పు వచ్చేందుకు కొంత సమయం ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించండం విడ్డూరంగా వున్నదని ఆయనవిమర్శించారు.

అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ సిబ్బందిని సస్పెండ్‌ చేస్తున్న చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధులను వెనకేసుకురావడంలోఅర్థం ఏమిటని అయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేవిషయంలో ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి వున్నా తక్షణం న్యాయవిచారణ జరిపించాలని ఆయనకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X