వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్డినెన్స్‌ పై అఖిలపక్షం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకుఉద్దేశించిన ఆర్డినెన్స్‌ ముసాయిదా పై అఖిలపక్షసమావేశాన్ని ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటుచేస్తుందని రాష్ట్ర హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌చెప్పారు. ఆర్డినెన్స్‌ వల్ల అధికార దుర్వినియోగానికిఅవకాశం వున్నదన్న ప్రతిపక్షాల భయాలనుఆయన కొట్టివేశారు. ఎస్‌పి స్థాయి ఉన్నతాధికారులకుమాత్రమే కొత్త చట్టంలోని అధికారాలను నేరుగావినియోగించుకోవడానికి అవకాశం వుంటుందనిఆయన చెప్పారు.

రంగారెడ్డిజిల్లాలోని 10 శివారు మున్సిపాల్టీలకు కలిపి ఒకపోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలనిప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా ఆయనచెప్పారు. రంగారెడ్డి జిల్లాలో జనాభా పెరుగుదలరాష్ట్రంలోని ఇతర అన్ని జిల్లాలకన్నా అధికంగావున్నదని శరవేగంతో విస్తరిస్తున్న ఈ 10శివారు మున్సిపాల్టీల్లో శాంతిభద్రతలపరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలుతీసుకోవల్సిన అవసరం వున్నదని ఆయనచెప్పారు. అందువల్ల కమిషనరేట్‌ ఏర్పాటు నిర్ణయంతీసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు.
పేలుడు పదార్ధాలు, మందుగుండు సామాగ్రినిఇక నేరుగా ప్రభుత్వమే క్వారీలకు సప్లయ్‌చేస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇందుకోసంఎక్స్‌ప్లోజివ్‌ మాగజైన్స్‌ను వివిధ జిల్లాల్లోఏర్పాటు చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X