వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ఃదుబాయ్ లో జరిగిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డవలప్ మెంట్ సదస్సులో పాల్గొన్నచంద్రబాబు నాయుడుకు సుమారు 60 దేశాలకుచెందిన 460 మంది డెలిగేట్లు బహ్మరథంపట్టారు. ఈ సందర్భంగా ఇటలీలో జరిగేఇ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొనాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం లభించింది.ప్రజాస్వామ్య దేశాలలో ఐ.టి సహకారంతో త్వరిత గతిన అభివృద్ధి సాధించడం ఎలా అనేఅంశంపై ఇటలీ లోని నేపుల్స్ లో ఒక సదస్సుజరగనుంది.
ఇటలీ ప్రభుత్వం ఈసదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది.ఇ-గవర్నెన్స్ పై ఈ సదస్సులో ప్రసంగించేందుకురావలసిందిగా ఇటలీ అధికార ప్రతినిధులుకొందరు చంద్రబాబును ఆహ్వానించారు. మార్చి 15నుంచి 17 వరకు ఈ సదస్సు నేపుల్ లో జరుగుతుంది.
Comments
Story first published: Tuesday, January 16, 2001, 23:53 [IST]