విద్యుత్ చార్జీలకుఆరు స్లాబ్స్
హైదరాబాద్:విద్యుత్ చార్జీల పెంపుదలకు సంబంధించిగత రెండునెలలుగా నెలకొన్న ఉత్కంఠకుతెరపడింది. తమ ఆదాయం, వ్యయానికిసంబంధించిన వివరాలను చార్జీల పెంపుదలకుసంబంధించిన ప్రతిపాదనలను ట్రాన్స్కోఎండి రమాకాంతరెడ్డి నాయకత్వంలోని అధికారులబృందం మంగళవారంనాడు విద్యుత్రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జిపి రావుకు అందజేసింది.తాజా ప్రతిపాదనల ప్రకారం గృహ వినియోగరంగాల్లో విద్యుత్ చార్జీలకు సంబంధించిప్రస్తుతం అమల్లో వున్న నాలుగు స్లాబులనుఆరు స్లాబులుగా పెంచాలని ప్రతిపాదించినట్టుగారమాకాంతరెడ్డి చెప్పారు.
హయ్యర్స్లాబ్స్లో
వున్నవారిపై
స్వల్పంగా
నాలుగుశాతంమేర
భారం
పడుతుందని
ఆయనచెప్పారు.
50
యూనిట్ల
వరకు
వున్న
తొలిస్లాబ్లోచార్జీల్లో
మార్పు
వుండదు.
కాగా
రెండు,మూడు,
నాలుగు
స్లాబ్స్లో
మాత్రం
స్వల్పంగా
చార్జీలుతగ్గుతాయి.
ఈ
ప్రతిపాదనల
వల్ల
ట్రాన్స్కోకు
40
కోట్లరూపాయల
అదనపు
భారం
పడుతుందనిరమాకాంతరెడ్డి
వెల్లడించారు.
అంతర్గతవనరులను, పనిసామర్ధ్యాన్ని మెరుగుపర్చుకోవడంద్వారా తాము వచ్చే ఏడాది 1400 కోట్ల రూపాయల మేరసమీకరించుకోవాలని ప్రతిపాదించినట్టుగా ఆయనవెల్లడించారు. ఇదిలా వుండగా ట్రాన్స్కోప్రతిపాదనలపై ప్రజల్లోని వివిధ వర్గాల నుంచిఅభిప్రాయాలను సమీకరించిన తర్వాత వచ్చే90 రోజుల్లో ప్రభుత్వానికి తమ సిఫారసులనుఅందజేస్తామని రెగ్యులేటరీ కమిటీ చైర్మన్జిపి రావు తెలియజేశారు.