వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎయిర్పోర్ట్పైదాడిలో 11 మంది మృతి
శ్రీనగర్:శ్రీనగర్లోని విమానాశ్రయంపై పాకిస్తాన్ కేంద్రంగాపనిచేస్తున్న ఒక ఉగ్రవాద సంస్థకు చెందినఆత్మాహుతి దళం మంగళవారం నాడుజరిపిన మెరుపు దాడి సందర్భంగా జరిగినభీకర ఘర్షణలో 11 మంది మరణించారు.దాడిలో పాల్గొన్న లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులుఆరుగురు సిఆర్పిఎఫ్ జవాన్ల కాల్పుల్లో మరణించారు.కాగా ఈ ఘర్షణలో ముగ్గురు జవాన్లతో పాటు మరోఇద్దరు సివిలియన్స్ కూడా మరణించారు.
పట్టపగలేలష్కర్ ఎ తోయిబా టెర్రరిస్టులు తెగించి విమానాశ్రయంపై దాడికి దిగడం ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతిపర్చింది. విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడికిదిగడం ఈ నెలలోనే ఇది రెండో సారి. దాడిజరిగిన కొద్ది సేపట్లోనే దాడి జరిపిందితమ సంస్థ సభ్యులేనని లష్కర్ ఎ తోయిబాప్రకటన విడుదల చేసింది. కొద్ది వారాలక్రితం ఎర్రకోటపై కూడా ఈ సంస్థకు చెందినఉగ్రవాదులే దాడి జరిపారు. ఈ దాడిలో ముగ్గురుసైనికులు మరణించారు.
Comments
Story first published: Tuesday, January 16, 2001, 23:53 [IST]