హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రపంచదేశాల్లో వున్న ప్రవాసాంధులు ముందుకు రావాలని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దుబాయ్ లోని తెలుగు సాంస్కృతిక సంఘం రసమయి ఏర్పాటు చేసినకార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సుమారు 5వేల మంది తెలుగు వారు పాల్గొన్న ఈసమావేశంలో చంద్రబాబు ప్రసంగించినంతసేపు సభికుల కరతాళ ధ్వనులతో ఆడిటోరియంమారుమోగి పోయింది.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగాచాటిన అన్ని నందమూరి తారకరామారావును పేరునుచంద్రబాబు ప్రస్తావించినప్పుడు ఐదు నిముషాలసేపు సభికులు కరతాళ ధ్వనులు చేశారు. ఈస్పందనతో చంద్రబాబు ఉప్పొంగిపోయారు. ఇంటర్నెట్యుగంలో ప్రపంచం వసుధైక కుటుంబంగామారిపోయిందని, ఈ పరిస్థితుల్లో కూడా తెలుగువారు ఇలా సమావేశం కావడం తనకుఎంతో ఆనందం కలిగిస్తున్నదని ఆయన అన్నారు.
భవిష్యత్తుఐ.టి. రంగానిదేనని, ఐ.టి. సహకారంతో ఆంధ్రదేశాన్ని సుసంపన్నం చేయాలని, పేదరికాన్ని నిర్మూలించాలన్నదే తన అభిమతమనిఆయన చెప్పారు. హైదరాబాద్ ను ఐ.టి.హబ్ గా, విజ్ఞాన కేంద్రంగా తీర్చి దిద్దనున్నట్లుఆయన చెప్పారు. ఆర్థికంగా స్థిరపడిన ఆంధ్రులు జన్మభూమిఅభివృద్ధికి తోడ్పడాలని, రాష్ట్రంలోపెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఒకనాడు ఎడారిగావున్న దుబాయ్ ఈ రోజున పెద్ద పర్యాటకకేంద్రంగా మారిందని, ఆంధ్ర ప్రదేశ్ ను కూడా పర్యాటకకేంద్రంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లుఆయన వివరించారు.
దుబాయ్ తెలుగువారిప్రశ్నలు....బాబు సమాధానాలు
ఆంధ్ర దేశంలోని వృత్తివిద్యా కళాశాలలో ఎన్.ఆర్.ఐ. లకు డొనేషన్లు లేకుండాసీట్లు కేటాయించాల్సిందిగా కొందరు తెలుగువారుచంద్రబాబును కోరారు. ఆ విషయాన్ని పరిశీలిస్తాననిచంద్రబాబు సమాధానం చెప్పారు. వరల్డ్ తెలుగుఫెడరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా దుబాయ్ లోని తెలుగువారు కోరగా, అటువంటి సంస్థ ఇప్పటికే వున్నదనిమరో సంస్థ అవసరం లేదని ఆయన చెప్పారు.
దుబాయ్ - భారత్ మధ్యమరిన్న విమాన సర్వీసులు ఏర్పాటు విషయాన్నిదుబాయ్ రాజుతో చర్చించానని, భారత ప్రభుత్వంతో కూడాచర్చించి సత్వర చర్యలు తీసుకుంటానని ఆయనవివరించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగాదుబాయ్ ప్రిన్స్ ను కోరానని, అందుకు ఆయన సమ్మతించారనిచంద్రబాబు చెప్పారు.