ఆంధ్రాలోపెట్టుబడులపై ఆసక్తి
హైదరాబాద్:అంధ్రప్రదేశ్లో పెట్టుబడులపై దుబాయి వాణిజ్యవేత్తలు అత్యంత ఆసక్తితో వున్నారు. దుబాయిపర్యటననుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతిరిగివచ్చినప్పటికీ ఇంకా అక్కడే వున్నరాష్ట్రమంత్రులు యనమల రామకృష్ణుడు,కోటగిరి విద్యాధరరావు, ఫరూఖ్ రాష్ట్రంలోపెట్టుబడి అవకాశాలను వివరిస్తూ దుబాయిపారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఐటి, టూరిజం రంగాల్లో పెట్టుబడులపట్ల సానుకూల ప్రతిస్పందనకనిపించినట్టుగా తెలిసింది. గుజరాత్లో 300ఎకరాల్లో ఐటి పార్క్ ఏర్పాటుకు సిద్ధంగా వున్నఒక దుబాయి పారిశ్రామిక వేత్త రాష్ట్రం చూపిస్తున్నచొరవకు ముగ్ధుడై తన ప్రాజెక్టునుఆంధ్రప్రదేశ్కు మార్చడానికి సంసిద్ధత వ్యక్తంచేసినట్టుగా తెలిసింది.
కాగాగంగవరం పోర్టుకు సంబంధించి జెబల్ అలీకంపెనీతో రాష్ట్రప్రభుత్వం టైఅప్ కుదుర్చుకున్నది.చంద్రబాబు ఆహ్వానం మేరకు దుబాయి యువరాజుఆ దేశ రక్షణ మంత్రి ఆంధ్రప్రదేశ్పర్యటనకు రావడానికి అంగీకరించినట్టుగాతెలిసింది. ఈ బృందం వచ్చివెళ్లిన తర్వాతమరింతపెద్ద మొత్తంలో పెట్టుబడులనురాబట్టడానికి అవకాశాలువుంటాయని అంటున్నారు.