వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైటెక్‌ సిటీకి లీపెంగ్‌ ప్రశంసలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః భారతదేశంలో పర్యటిస్తున్న చైనా అగ్రనేత లీపెంగ్‌ కుబుధవారం ఉదయం హైదరాబాద్‌ లోఘనస్వాగతం లభించింది. ఎయిర్‌ చైనా కు చెందిన ప్రత్యేక విమానంలోబుధవారం ఉదయం 10.30 గంటలకు లీపెంగ్‌ బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. సతీసమేతంగా వచ్చిన లీపెంగ్‌ వెంటఉన్నతాధికారులు, చైనా పారిశ్రామిక వేత్తలతో కూడిన 110 మంది సభ్యులతో కూడినబృందం కూడా హైదరాబాద్‌ వచ్చింది. బుధవారంఉదయమే దుబాయ్‌ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఆయన సతీమణి భువనేశ్వరి, రాష్ట్ర హోం మంత్రిదేవేందర్‌ గౌడ్‌ లీపెంగ్‌ కు ఘనంగా స్వాగతంపలికారు.

అనంతరం లీపెంగ్‌ మాదాపూర్‌ లోని హైటెక్‌ సిటీని సందర్శించారు. అందులో ఏర్పాటు చేసిన వివిధ కంప్యూటర్‌ సంస్థలను లీపెంగ్‌సందర్శించారు. ఈ సందర్శంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీరంగంలో హైదరాబాద్‌ సాధించిన, సాధిస్తున్న ప్రగతిపైచంద్రబాబు నాయుడు లీపెంగ్‌ బృందానికి వీడియోప్రజెంటేషన్‌ ఇచ్చారు. లీపెంగ్‌ సుమారు అరగంటకుపైగా హైటెక్‌ సిటీలో గడిపారు.

అనంతరం లీపెంగ్‌ కు ముఖ్యమంత్రి తననివాసంలో విందు ఏర్పాటు చేశారు. లీపెంగ్‌ తో చంద్రబాబు నాయుడు గంటసేపుముఖాముఖి చర్చలు నిర్వహించారు. ఐ.టి సహకారంలోరాష్ట్రాభివృద్ధికి చేపడుతున్న చర్యలనుచంద్రబాబు ఆయనకు వివరించారు. ఆ తరువాత లీపెంగ్‌ ట్యాంక్‌ బండ్‌ సమీపంలోనిప్రతిష్ఠాత్మకమైన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టునుసందర్శించారు. నగరంలో రెండున్నర గంటల పాటు పర్యటించిన అనంతరం లీపెంగ్‌తిరుగుప్రయాణం అయ్యారు.

అంతకు ముందు చంద్రబాబు తన నివాసంలో జరిగిన విందు సందర్భంగా లీపెంగ్‌ కు చార్మినార్‌బొమ్మతో కూడిన మొమెంటో అందజేశారు. లీపెంగ్‌ బృందానికి బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు దంపతులు బేగంపేట విమానాశ్రయలో వీడ్కోలుపలికారు. అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ తరువాత హైదరాబాద్‌ సందర్శించిన అగ్రనేత లీపెంగ్‌ కావడం విశేషం. చైనా నేషనల్‌పీపుల్స్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ అయిన లీపెంగ్‌ దేశ ప్రధాని తరువాత అత్యున్నత అధికారాలు అనుభవిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X