వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్‌ పైబాబు అంకెల గారడీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃవిద్యుత్‌ ఛార్జీలను దొంగచాటుగా మరో సారి పెంచేందుకుచంద్రబాబు నాయుడు ప్రభుత్వం రంగంసిద్ధం చేసుకుంటున్నదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది.
సంపన్న వర్గాలకు మాత్రమే విద్యుత్‌ఛార్జీలు పెంచాలని, గతంలో ఏర్పాటు చేసిన నాలుగుశ్లాబులను ఆరు శ్లాబులకు పెంచి మధ్యతరగతి వారికి ఊరట కల్పించాలనే ట్రాన్స్‌ కోప్రతిపాదనలు కేవలం తెలుగుదేశంప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీ అని కాంగ్రెస్‌పార్టీ ధ్వజమెత్తింది. ట్రాన్స్‌ కో పీకల్లోతు అప్పుల్లోకూరుకు పోయిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధికె. రోశయ్య బుధవారం విలేకరులసమావేశంలో విమర్శించారు.

సుమారు 10,000 వేల కోట్లు రూపాయల లోటు వున్నట్రాన్స్‌ కో ఆ లోటును ఎలా భర్తీ చేస్తుందనిఆయన నిలదీశారు.
గృహరంగంలో ఆరు శ్లాబులను ఏర్పాటు చేయడంతోపాటు సంపన్న వర్గాలకు 40 కోట్లు రూపాయల మేరకువడ్డిస్తూ ట్రాన్స్‌ కో తాజా ప్రతిపాదనలను విద్యుత్‌రెగ్యులేటరీ కమిషన్‌ కు సమర్పించింది.

గతజూన్‌ లో ట్రాన్స్‌ కో అసాధారణ రీతిలో విద్యుత్‌ఛార్జీలు పెంచగా, వాటికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తునఉద్యమాలు చెలరేగిన విషయం విదితమే.వాస్తవాని భారీ లోటు వున్నప్పటికీ త్వరలోసంస్థాగత ఎన్నికలు జరగున్నందున మళ్ళీవిద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఎన్నికల్లో అడ్రస్‌లేకుండా పోతామనే భయంతో తెలుగుదేశంపార్టీ ఈ సారి నొప్పిలేకుండా వడ్డనలు చేసిందనిరోశయ్య అభిప్రాయపడ్డారు.

భారీ లోటు వుందని చెబుతూనే ఆ లోటుఎక్కడి నుంచి పూడ్చుకోవాలో చెప్పక పోవడంవిడ్డూరంగా వుందని రోశయ్య వ్యాఖ్యానించారు.స్థానిక ఎన్నికల అనంతరం చక్రవడ్డీతో సహావిద్యుత్‌ ఛార్జీల పెంచుతారని ఆయన జోస్యంచెప్పారు.

  • విద్యుత్‌ చార్జీలకు ఆరు స్లాబ్స్‌


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X