తెలుగుదేశానికేఆంధ్రుల మద్దతు
దుబాయి:ప్రజల్లోతన పాపులార్టీ తగ్గినట్టుగా వస్తున్న వార్తల్లోఏమాత్రం నిజం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుచెప్పారు. మంగళవారం నాడు దుబాయిపర్యటన ముగించుకుని వచ్చే ముందుప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలోఆయన ప్రసంగించారు. ఒక పత్రిక ఇటీవల నిర్వహించినసర్వేలో తన పాపులార్టీ తగ్గినట్టుగావెల్లడయినట్టు వచ్చిన వార్తల గురించిస్థానిక విలేకరులు ప్రశ్నించగా, పనిచేసేవారినిప్రజలు ఎప్పుడూ ఆదరిస్తునే వుంటారని చంద్రబాబుచెప్పారు. గత ఎన్నికల సమయంలో కూడాతనకు ప్రజల్లో ఆదరణ తగ్గిందని కొన్నిపత్రికలు ప్రచారం చేశాయని అయితే విజయంతననే వరించిందని ఆయన చెప్పారు. ఈక్షణంలో ఎన్నికలు జరిగినా తమ పార్టీ విజయభేరీమోగిస్తుందని ఆయన ధీమాగా అన్నారు.
ఆంధ్రప్రదేశ్నుఅభివృద్ధి పథంలోకితీసుకువెళ్లాలన్నదే తన లక్ష్యమని ఆయనచెప్పారు. అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్నుఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్టుగాఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక కార్యక్రమాలను పలు ఇతరరాష్ట్రాలు ఇప్పటికే కాపీ కొడుతున్నాయని ఆయనవెల్లడించారు.