వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రమంతటాసన్నిహిత ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలను నెలకొల్పడానికి తలపెట్టినసన్నిహిత పథకం రాష్ట్ర వ్యాప్తంగా గురువారంప్రారంభమైంది. దీన్ని నిజామాబాద్‌లో హోంమంత్రిటి. దేవేందర్‌ గౌడ్‌ ప్రారంభించారు.హైదరాబాద్‌లోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రికె. విజయరామారావు ప్రారంభించారు. జంటనగరాలకేంద్ర ఫిర్యాదుల విభాగాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ పథకం వల్ల పోలీసులు ప్రజలకు మరింతసన్నిహితులు అవుతారని రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌హెచ్‌. జె. దొర ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధిత పోలీసుస్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు ఈ విభాగంలోఫిర్యాదులు ఇవ్వవచ్చునని ఆయన చెప్పారు. సంబంధిత పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేయకపోయినా నేరుగా ఈ విభాగంలో ప్రజలు తమఫిర్యాదులను అందించవచ్చునని ఆయనచెప్పారు. ఈ ఫిర్యాదులను సంబంధిత పోలీసుస్టేషన్లకు పంపి మూడు నాలుగు రోజుల్లోపరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లుఆయన తెలిపారు. ఫిర్యాదులను కంప్యూటర్లలోపొందు పరిచి ఆన్‌లైన్‌ సౌకర్యం కల్పించనున్నట్లునగర పోలీసు కమిషనర్‌ పేర్వారం రాములు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X