గోదావరి పై హైడల్ ప్రాజెక్టులు
హైదరాబాద్: విద్యుత్ చార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభా సంఘ ప్రభుత్వానికి అనేక సిఫారసులను చేసింది. అన్ని విషయాలను క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత సభాసంఘం గోదావరి నదిపై మరిన్ని హైడల్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని, రాష్ట్రానికి అణువిద్యుత్ ప్లాంట్ వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది.
గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రొత్సహించడంతోపాటు ఈ ప్లాంట్లలో కొన్ని జెన్కోకు అప్పగించాలని సంఘం సూచించింది. అదే విధంగా తృతీయ పార్టీ సేల్ విధానాన్ని అమలుచేయవద్దని, అక్రమ కనెక్షన్ల విషయంలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా సంఘం సూచించింది.
400
యూనిట్లపై
బడి
కాల్చే
ఇళ్లకు
సబ్సిడీని
ఎత్తివేయాలని
అదే
విధంగా
వ్యవసాయ
విద్యుత్కు
యూనిట్కు
50
పైసలు
వసూలు
చేయాలని
సభాసంఘం
సిఫారసు
చేసింది.
నాన్
టెలీస్కోపిక్
విధానాన్ని
అనుసరించాలని
కూడా
సంఘం
సిఫారసు
చేసింది.
రాష్ట్రంలో
ఆరు
డిస్ట్రిబ్యూషన్
కంపెనీలను
ఏర్పాటు
చేయాలని
ఏ
ఒక్క
సంస్థకు
రెండు
డిస్ట్రిబ్యూషన్
కంపెనీలను
ఇవ్వరాదని
కూడా
సభాసంఘం
స్పష్టం
చేసింది.
ట్రాన్స్కోలో
అవినీతిని
అరికట్టేందుకు
కట్టుదిట్టమైన
చర్యలు
తీసుకోవాలని
కోరింది.